సమంతకు దాదాపుగా 12 కోట్ల నష్టం వచ్చిందని తెలుస్తోంది. ఆమె మయోసైటీస్ అనే కండరాల వ్యాధితో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత సినిమాల నుండి ఏడాది పాటు లాంగ్ గ్యాప్ తీసుకోబోతుందట. షూటింగ్ దశలో ఉన్నవి కాకుండా కొత్తగా కమిట్ అయిన ఫిలింస్ క్యాన్సిల్ చేసుకుంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చి తన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న నిర్మాతలను పిలిపించి వారి డబ్బు తిరిగి ఇచ్చేస్తోందట. అయితే కొద్దిరోజుల తర్వాత ఇద్దరూ అధికారిక ప్రకటన చేశారు. పరస్పర అవగాహనతో విడిపోతున్నట్లు వెల్లడించారు.
సమంత, నాగ చైతన్య అభిమానులు ఒకింత బాధపడ్డారు. విడాకులకు కారణాలు ఏమిటనేది తెలియదు. ఈ విషయంలో సమంత ఎక్కువగా విమర్శలకు గురైంది. మీడియా ఆమెను టార్గెట్ చేసింది. సమంతకు పిల్లలు కనడం ఇష్టం లేదు. కుటుంబ విలువలు పాటించడం లేదు. పెళ్లయ్యాక కూడా బోల్డ్ రోల్స్ చేస్తుంది. తన పర్సనల్ స్టైలిస్ట్ తో ఎఫైర్ పెట్టుకుంది అంటూ కథనాలు వెలువడ్డాయి. సమంత ఈ పుకార్ల మీద సీరియస్ అయ్యింది. లీగల్ యాక్షన్ కి కూడా సిద్ధమైంది. అదే సమయంలో కొన్ని ఇంటర్వ్యూలలో నాగ చైతన్య మీద తన కోపాన్ని సమంత ప్రదర్శించింది.
పరోక్షంగా నాగ చైతన్యతో తనకు ఎంత దూరం పెరిగిందో చెప్పింది. కాగా సమంత ఒంటిపై మూడు టాటూలు ఉంటాయి. ఒకటి చేతి మీద, మరొకటి వీపు మీద, ఇంకొకటి రిబ్స్ దగ్గర. చెస్ట్ క్రింద సమంత నాగ చైతన్య పేరు వేయించుకుంది. విడాకుల తర్వాత కూడా ఆ టాటూ ఆమె చెరుపుకోలేదు. పలు ఫోటో షూట్స్ లో అది రివీల్ అయ్యింది. తాజా ఫోటో షూట్లో సమంత ఒంటిపై నాగ చైతన్య పేరు కనిపించలేదు. ఖచ్చితంగా తన రిబ్ హైలెట్ అయ్యేలా సమంత ఒక ఫోజ్ ఇచ్చింది. రిబ్ దగ్గర ఉండాల్సిన నాగ చైతన్య పేరు లేదు. కాబట్టి నాగ చైతన్యకు సంబంధించిన ఆ చివరి జ్ఞాపకం కూడా సమంత చెరిపివేసిందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. అయితే మేకప్ తో ఆమె కవర్ చేసి కూడా ఉండొచ్చని మరొక అనుమానం. మొత్తంగా సమంత ఫోటోలు కొత్త చర్చకు దారి తీశాయి.