సోషల్ మీడియాలో వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి సంబరాల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వరుణ్ లవ్ పెళ్ళికి టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. తాజాగా కాక్టెయిల్ పార్టీ, హల్దీ వేడుకలు ముగిసాయి. ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలో రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహాలు కలర్ఫుల్గా కనిపించారు.
మిస్టర్ సినిమాతో తొలిసారి కలిసి నటించిన వరుణ్ తేజ్ లావణ్య.. ఆ మూవీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు ఈ ఇద్దరు. అప్పటి నుంచి వీరి ప్రేమ విషయాన్నీ చాలా సీక్రెట్ గా ఉంచారు. అయితే ఈ వివాహానికి మెగా, అల్లు, కామినేని, లావణ్య ఫ్యామిలీలు, పలువురు సన్నిహితులు హాజరయ్యారు. అలాగే సినీ పరిశ్రమ నుంచి కూడా కొందరు హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే నితిన్ తన భార్యతో కలిసి అక్కడ సందడి చేస్తున్నాడు. ఫ్యాషన్ డిజైనర్ నీరజ కోనతో పాటు మరికొందరు ఇండస్ట్రీ స్టార్స్ కూడా హాజరయ్యినట్లు సమాచారం. కాగా ఈ పెళ్ళికి నాగచైతన్య, సమంత, రష్మిక మందన్న కూడా వెళ్ళబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.