సమంత ఫ్యాన్స్లో నిరాశలో నిండిపోయింది.. సినిమాలకు గ్యాప్ ఇస్తున్నా అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అమ్మడి అభిమానులంతా డల్ అయిపోయారు డీలాపడ్డారు. ప్రస్తుతం చేస్తున్న ఖుషి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాలకు టాటా చెప్పారు సామ్. ఓ లాంగ్ గ్యాప్ తీసుకొని ఆరోగ్యం పైన జీవితం పైన దృష్టి పెట్టాలనుకుంటున్నా.. అని అనౌన్స్ చేసింది సామ్. అలా అనౌన్స్ చేసిన వెంటనే లగేజ్ దర్దుకొని విమానమెక్కేసింది. అయితే సమంత గత నెలలో తాను సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాను చేయాల్సిన ఖుషి
, సిటాడెల్
షూటింగ్లు పూర్తి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది. ఆధ్యాత్మిక సేవలో, మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రదేశాల్లో ఉంటుంది. గ్రీనరీని ఎంజాయ్ చేస్తుంది. చిన్న పిల్లలతో ఆడుకుంటుంది. తన పెట్స్ తో టైమ్ స్పెండ్ చేస్తూ చిల్ అవుతుంది. యోగాసనాలు చేస్తూ, జిమ్లో శ్రమిస్తూ తన ఫిట్నెస్ని పెంచుకుంటుంది. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది సమంత. తన క్యూట్ పిక్ని షేర్ చేసుకుంది. దీంతోపాటు తన నెయిల్ పెయింటింగ్స్ ని చూపించింది.
మరోవైపు జిమ్లో చెమటొడుస్తున్న ఫోటోలను కూడా ఇందులో షేర్ చేసుకుంది సమంత. వీటితోపాటు తన పెట్స్, బుక్స్, పూల బొకే, అలాగే ఒక సందేశాన్ని ఆమె పోస్ట్ చేసింది. ఇందులో చిలిపి పోజులతో ఎంతో క్యూట్గా ఉంది సమంత. బెడ్ పై పడుకుని, గ్లాసెస్ ధరించి కొంటెగా ఓ సెల్ఫీ తీసుకుని దాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. ఇది ఫ్యాన్స్ ని అలరిస్తుంది. మరోవైపు ఓ మంచి సందేశాన్ని ఇచ్చింది. మనం చేయాల్సిన పనుల గురించి ఆమె చదివిన కోట్ని షేర్ చేసింది.