గత కొన్నిరోజులుగా మయోసైటిస్తో బాధపడుతున్న సామ్.. దాని చికిత్స కోసం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వ్యాధి చికిత్సకు అమెరికా వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామ్ అమెరికా పయనమవడంతో అందరూ చికిత్స కోసమే అని అనుకుంటున్నారు. అయితే ఖుషి ప్రమోషన్స్ ముగియడంతో సమంత మయోసైటిస్ చికిత్స కోసం శుక్రవారం అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడే ఆమె ఓ మూడు నెలలపాటు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అయితే మయోసైటీస్ చికిత్స ఖర్చు మాత్రం 25 కోట్లు ఉంటుందని, ఈక్రమంలో ఆమె ఓ హీరో దగ్గర కొంత అప్పుగా కొంత డబ్బు తీసుకుందని ఇటీవల కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంలో సమంత స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో రాస్తూ.. అదంతా ఫేక్ అని.. నా చికిత్సకు అంత ఖర్చు కాదని.. నేను సినిమాల్లో నటించి బాగానే సంపాదించాను. నాకు ఎవరి అవసరం లేదు..అంటూ ఘాటుగా స్పందించారు. మరోవైపు సమంతకు దాదాపుగా 12 కోట్ల నష్టం వచ్చిందని తెలుస్తోంది.
ఆమె మయోసైటీస్ అనే కండరాల వ్యాధితో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత సినిమాల నుండి ఏడాది పాటు లాంగ్ గ్యాప్ తీసుకోబోతుందట. షూటింగ్ దశలో ఉన్నవి కాకుండా కొత్తగా కమిట్ అయిన ఫిలింస్ క్యాన్సిల్ చేసుకుంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చి తన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న నిర్మాతలను పిలిపించి వారి డబ్బు తిరిగి ఇచ్చేస్తోందట. అలా ఈ రెండు సంవత్సరాల్లో చేయబోయే సినిమాలను అన్ని క్యాన్సల్ చేసిందట.ఇక సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ నటుడు వరుణ్ ధావన్, సమంత జంటగా నటిస్తోన్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
Our cutie with mom off to New York 🤌🏼🫶🏼
— RoshSam💌 (@RoshSamLover) August 18, 2023
Happy safe journey Sammy❤️@Samanthaprabhu2 #SamanthaRuthPrabhu #Samantha pic.twitter.com/bk0svKb7zS