హౌస్ నుంచి రతిక ఔట్. అయినా ఎన్ని లక్షలు తీసుకుందో తెలుసా..?

ఆదివారం ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. మెుదటి శివాజీ నేను ఎందుకు అనర్హుడినే చెప్పాలని నాగార్జునను ప్రశ్నించారు. ఈ విషయానికి సంబంధించి కింగ్ శోభాను ప్రశ్నించారు. నాగ్ ప్రశ్నలకు ఈ అమ్మడు సరైన సమాధానాలు చెప్పలేకపోయింది.అయితే తన ప్రవర్తనకు తోడు ఓట్లు తక్కువ రావడంతో నాలుగో వారంలోనే హౌజ్‌ నుంచి బయటకు వచ్చింది రతిక. కాగా నాగ్‌ ఎలిమినేట్‌ అని ప్రకటించగానే రతిక ఎమోషనల్‌ అయ్యింది.
‘నేను ఎలిమినేట్ అవ్వడం కలగా ఉంది’ అని కన్నీళ్లు పెట్టుకుంది. దీన్నిబట్టి హౌజ్‌లో ఉండాలని ఆమె ఎంత గట్టిగా అనుకుంటుందో అర్థం చేసుకోవచ్చు.

కాగా నాలుగో వారంలోనే బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన రతిక రెమ్యునరేషన్‌ మాత్రం గట్టిగానే తీసుకుందట. రోజుకు 28 వేలు, ప్రతివారం 2 లక్షల రూపాయల చొప్పున మొత్తం నాలుగు వారాలకు కలిపి రూ. 8 లక్షల పారితోషకం అందుకుందట. మరికొన్ని రోజులు హౌజ్‌లో ఉండి ఉంటే రతిక మరింత మొత్తం తీసుకునేదేమో. అయినా ఇంత త్వరగా ఎలిమినేట్‌ అయినప్పటికీ గట్టిగానే రెమ్యునరేషన్‌ అందుకున్నట్లు తెలుస్తోంది. కాగా బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి అడుగుపెట్టారు. అందులో రతికా రోజ్‌ ఆరంభంలోనే అందరి చూపును తన వైపునకు తిప్పుకునేలా చేసింది.

తన గ్లామర్‌తోనూ కట్టిపడేసింది. పల్లవి ప్రశాంత్‌తో ప్రేమగా మాట్లాడుతూ జనాల మనసు చూరగొంది. అయితే అదంతా ఆటలో భాగమేనని త్వరగానే అర్ధమైపోయింది. రైతుబిడ్డకు వెన్నుపోటు పొడిచి ప్రిన్స్‌ యావర్‌తో ప్రేమగా నటించింది. చివరకు అతనితో కూడా గొడవపడింది. వీరి విషయంలోనూ కాదు.. ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తూ తోటి కంటెస్టెంట్స్‌కే చిరాకు తెప్పించింది. ఈ కారణంగానే నాలుగో వారం ఆరంభం నుంచే రతికనే ఎలిమినేట్‌ అవుతుందన్న వచ్చాయి. ఓటింగ్‌ కూడా తక్కువ రావడంతో హౌజ్‌ నుంచి ఈ హాట్‌ బ్యూటీ బయటకు రాక తప్పలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *