సీఎంని చేయండి.. వారికి సాయం చేస్తా అంటున్న పల్లవి ప్రశాంత్, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి.

మొదటి నుంచి ప్రశాంత్ వైకరి కాని.. అతనిమాటలు కాని.. డిఫరెంట్ గానే ఉన్నాయి. గేమ్ ఆడియాన.. రైతు బిడ్డను అన్న పేరు.. సింపతీ.. బేస్ మీదనే చాలా వరకూ డిపెండ్ అయ్యాడు ప్రశాంత్. ఇక టైటిల్ సాధించి..ఫైనల్ అయినోయిన తరువాత బయటకి వచ్చిన తరువాత జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ప్ 6 కంటెస్టుల జాబితాలోకి చేరాడు. అయితే ఆది నుంచి అతడే విన్నర్ అవుతాడని ఉన్నప్పటికీ.. శివాజీ, అమర్ లాంటి బలమైన పోటీ దారులు ఉండటంతో.. అంచనాలు కాస్త అదుపు తప్పాయి. కానీ ఆశించినట్లే.. ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. ఇక విజేతగా బయటకు వచ్చిన ప్రశాంత్ రెండో కోణాన్ని ప్రదర్శించాడు.

ఎవరైతే తన విజయానికి కారణమయ్యారో వాళ్ల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఇంటర్వ్యూలు ఇస్తానని ఇంటికి పిలిచి.. ఆ తర్వాత కల్లబొల్లి కబుర్లు చెప్పడం, యూట్యూబర్లను, యాంకర్లను గంటలు గంటలు వెయిట్ చేయించి.. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వనని చెప్పాడు. సుమారు 10 మీడియా సంస్థలను ఇబ్బంది పెట్టాడు ఈ రైతు బిడ్డ. 10 నిమిషాల ఇంటర్వ్యూ ఇవ్వమని కోరితే.. ‘మీరు పొలం దగ్గరకు పనులు చేయండి, వీడియోలు తీసుకోండి, మీ యూట్యూబ్ ఛానల్స్ నుంచి రైతులకు ఏమిస్తారో చెప్పుర్రి. ఆ తర్వాతే మీకు ఇంటర్వ్యూలు ఇస్తా’ అంటూ ఓవర్ యాక్షన్ చేశాడు. దీంతో ఓ యూట్యూబర్ ‘మీ సమీపంలోనే మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ఉంది.

మీరు రైతుగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన దాదాపు 14 గ్రామాల రైతులకు మీరేమైనా సాయం చేశారా? వారికి మద్దతుగా నిలిచారా?’ అని అడగ్గా.. వెటకారంగా సమాధానం ఇచ్చాడు. ‘నాకేమైనా సీఎం పదవి ఇచ్చిర్రా? ఏదైనా చేయడానికి, నేను ఒక రైతు బిడ్డను కదా. సీఎం చేస్తరా చెప్పుండ్రి. అందరినీ ఆదుకుంటా. నేనేమైనా నాయకుడినా, నేనేం చేస్తా’ అంటూ పొగరుగా సమాధానం ఇచ్చాడు. ఈ మాటలు, అతడి చర్యలను మీడియా యాంకర్లు తప్పు పడుతున్నారు. మరి అతడు నిజంగానే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక తనలో ఉన్న రెండో కోణాన్ని బయటపెట్టినట్లు మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *