కోర్టుకెక్కిన రేణు దేశాయ్‌, ఏం జరిగిందో తెలుసా..?

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెరైన్ పార్క్‌కు వ్యతిరేఖంగా కొందరు సెలబ్రిటీలతో కలిసి పోరాటం మొదలెట్టారు. ఇక ఈక్రమంలోనే.. మెరైన్ పార్క్‌ వల్ల.. పకృతి విధ్వంసం జరుగుతుందంటూ… కోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే నటి రేణు దేశాయ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచితురాలే. హీరోయిన్‌గా ఎక్కువ సినిమాలు చేయకపోయినా ఇండిస్టీలో ఆమెకు మంచి పేరుంది.

రేణు సోషల్‌ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటోంది. హైదరాబాద్‌ నగర శివారులోని కొత్వాల్‌ గూడలో ఆక్వా మెరైన్‌ పార్క్‌, పక్షిశాల ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఆక్వా మెరైన్‌ పార్క్‌ కోసం ‘కృత్రిమ సరస్సు’ను సృష్టించడం పర్యావరణానికి ప్రమాదమనీ, వెంటనే పార్క్‌ ఏర్పాటు చర్యలను నిలిపేయాలంటే రేణు దేశాయ్ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

రేణు దేశాయ్ తో పాటు, నటి శ్రీదివ్య, డైరెక్టర్‌ శశికిరణ్‌ తిక్కా, హీరోయిన్‌ సదాతో పలువురు సెలబ్రెటీలు కూడా ఈ పార్క్‌ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వీరందరూ కలిసే జూన్‌ 27న కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటీషన్‌ను న్యాయస్థానం అంగీకరించింది. వీరి పిటిషన్‌ని పరిశీలించిన న్యాయస్థానం చీఫ్‌ జస్టిస్‌ ఉజ్వల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌. తుకారామ్‌ జి.. ఇలాంటి పార్కుల నిర్మాణం సింగపూర్‌, మలేషియా లాంటి దేశాల్లో జరిగింది. మన దేశంలో ఎందుకు జరగకూడదు అని ప్రశ్నించారు. తుది తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *