రెంజూషా మీనన్ మలయాళ సీరియల్ ‘స్త్రీ’తో నటిగా రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత ఆణె అనేక చిత్రాలలో కీలక పాత్రల్లో నటించింది. తన భర్తతో కలిసి అపార్ట్మెంట్లో నివసిస్తోంది. అయితే రెంజూషా మీనన్ మలయాళ సీరియల్ ‘స్త్రీ’తో నటిగా రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత ఆణె అనేక చిత్రాలలో కీలక పాత్రల్లో నటించింది. తన భర్తతో కలిసి అపార్ట్మెంట్లో నివసిస్తోంది. అయితే ఆమె మరణానికి కొన్ని గంటల ముందే తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను షేర్ చేసింది.
ఆ వీడియోలో రీల్స్ చేస్తూ చాలా ఉత్సాహంగా కనిపించింది. అంతలోనే ఈ విషాదం చోటు చేసుకోవడంతో అభిమానులు జీర్ణించు కోలేకపోతున్నారు. ఆమె ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు సమాచారం. ఆ కారణంతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు. రెంజూషా టీవీ సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ నటిస్తోంది. కొచ్చికి చెందిన రెంజూషా ఒక మొదట యాంకర్గా తన కెరీర్ను ప్రారంభించింది.
ఆ తర్వాత ‘స్త్రీ’ సీరియల్తో బుల్లితెరపై మెరిసింది. ‘నిజలాట్టం,’ ‘మగలుడే అమ్మ,’ బాలామణి’ లాంటి ధారావాహికల్లో కనిపించింది. అంతే కాకుండా ‘సిటీ ఆఫ్ గాడ్’, ‘మెరిక్కుండోరు కుంజడు’ అనే సినిమాల్లో కూడా కనిపించింది. చివరిసారిగా ‘ఆనందరాగం’ అనే టీవీ షోలో లీడ్ రోల్ పాత్ర పోషించింది.