తిరుమల శ్రీవారి సేవలో రవిబాబు, రవి బాబు కూతురుని చుస్తే..?

తిరుమల శ్రీవారిని శనివారం వీఐపీ విరామ సమయంలో సినీ నటుడు, డైరెక్టర్ రవిబాబు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ దర్శకుడు రవిబాబు దర్శించుకున్నారు.

శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా..ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల దర్శకుడు రవిబాబు మీడియాతో మాట్లాడుతూ..సినిమా పూర్తి అయిన అనంతరం శ్రీ వారిని దర్శించుకోవడం అనవాయితీగా వస్తోందన్నారు. కోవిడ్ అనంతరం సినిమా పూర్తి అయ్యాక తిరుమలకు రావడం తగ్గిందని చెప్పారు.

గత నెల రెండు సినిమాలు పూర్తి అయ్యాయన్నారు. ఈ క్రమంలో తను ఫన్నీ గా జోక్స్ వేస్తూ అందరినీ నవ్వించారు. మా ఆవిడ తిట్టడంతో మళ్లీ తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నానని చమత్కరించారు. వాషింగ్ మిషన్ రష్ అనే సినిమాలు విడుదల కానున్నాయని తెలిపారు. అవును 3 తీయాలంటే సినిమా హీరోయిన్ పూర్ణకు పెళ్లి అయిపోయిందని జోకులు విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *