రష్మిక మందన్ పుష్ప2 నుంచి ఓ కీలక సన్నివేశాన్ని లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో పుష్ప 2 సెట్స్ నుంచి ఓ ఫోటోను పంచుకుంది. ఓ భారీ భవంతిలో షూట్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే రష్మిక ఆ ఫోటోను బ్లాక్ అండ్ వైట్’లో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. అయితే ‘పుష్ప 2’ సినిమాక సంబంధించి వచ్చే అప్ డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ‘పుష్ప 2’ సెట్ కు సంబంధించిన ఫోటోను హీరోయిన్ రష్మిక మందన్నతన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న భారీ భవంతిలో రష్మిక, అల్లు అర్జున్ మధ్య సీన్లు షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలోని ఫ్యామిలీ సీన్స్ చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘పుష్ప2’ నుంచి పలు సీన్లు లీక్ అయ్యాయి. తాజాగా ‘పుష్ప 2’ మూవీ లారీలు అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

తాజాగా హీరోయిన్ రష్మిక సెట్ ఫోటో లీక్ చేయడంతో సినిమాపై మరింత ఆసక్తి కలిగిస్తోంది. ఇక తాజాగా ‘పుష్ప- ది రూల్’ సినిమా విడుదల తేదీపై మేకర్స్ ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది(2024) మార్చి 22న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ‘పుష్ప’ సినిమాతో పోల్చితే ‘పుష్ప2’ కనీవినీ ఎరుగని రీతిలో సక్సెస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.