విజయవాడ నీటి పారుదల శాఖ గెస్ట్ హౌస్లో ఆయన క్యాంప్ ఆఫీస్ ఉంది. దీంతో ఆ ఆఫీస్ ముందు ఏర్పాటు చేసిన నేమ్ బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జన సైనికులు ఈ నేమ్ బోర్డును తెగ షేర్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది.
జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో ఘన విజయం సాధించారు. కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. మంత్రి వర్గ విస్తరణలో ఆయన కోరుకున్న స్థానాలతో పాటు డిప్యూటీ సిఎం పదవిని కేటాయించారు. బుధవారం విజయవాడలో బాధ్యతలు చేపట్టారు.
పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషన్ కుమార్తో పాటు ఇతర అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టడానికి ముందు విజయవాడ ఇంద్రకీలాద్రికి చెందిన వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్కు సాయుధ పోలీసులు గౌరవ వందనం పలికారు.