నరేష్ , పవిత్ర లోకేష్ మేటర్ గురించి శ్రీరెడ్డి ని ప్రశ్న అడగగా.. ఆమె ఒక రేంజ్ లో రెచ్చిపోయింది. ఎప్పటిలాగే బండబూతులతో నరేష్ ను ఏకీపారేసింది. అయితే మీటూ ఉద్యమంతో ఫుల్ ఫేమస్ అయ్యింది శ్రీరెడ్డి. టాలీవుడ్ ను వదిలి కోలీవుడ్ చేరిన ఈ కాంట్రవర్సియల్ స్టార్.. టాలీవుడ్ లో ఏం జరిగినా తనదైన శైలిలో స్పందిస్తుంటుంది.
ఇక ఈసారి శ్రీరెడ్డి స్పందించడానికి మంచి టాపిక్ దొరికింది. అదే ప్రస్తుతం నడుస్తున్న నరేష్, పవిత్ర లోకేష్ హాట్ టాపిక్. పవిత్ర, నరేష్ కాంట్రావర్సీపై నటి శ్రీరెడ్డి స్పందించింది. పవిత్రా లోకేశ్పై సంచలన ఆరోపణలు చేసింది. . ఆమెకు ఎంతోమందితో రిలేషన్షిప్స్ ఉందని చాలా జీవితాల్లో నిప్పులు పోసిందంటూ శ్రీరెడ్డి ఘాటుగా విమర్షించింది. అంతే కాదు తాను ఎవరికి భయటపడనని.. సైలెంట్ గా ఏదో అనేయడానికి రాలేదంటూ తొడకొట్టింది శ్రీరెడ్డి.
రీసెంట్ గా ఫేస్బుక్ లైవ్లో మాట్లాడిన శ్రీరెడ్డి.. పవిత్రా లోకేశ్పై తీవ్ర ఆరోపణలుచేసింది. ఎందుకు ఇతరుల జీవితాల్లో నిప్పులు పోస్తున్నావు.. నీ గురించి ఎవరికి తెలియదనుకుంటున్నావా..? అసలు నరేష్ భార్య విషయంలో కలుగజేసుకోవడానికి నువ్వు ఎవరు..? ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడటానికి నువ్వెవరు..? నీకేం హక్కుంది అంటూ మండి పడింది శ్రీరెడ్డి.