తికుండాగానే చంపేశారు.. ఎందుకిలా చేశావని కాలర్ పట్టుకుని అడుగుతానంటున్న పావలా శ్యామలా.

తాజాగా మరోసారి సీనియర్ నటి పావలా శ్యామల.. కమెడియన్ హైపర్ ఆది పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జబర్దస్త్ షోలో ఓ స్కిట్లో భాగంగా తనను చనిపోయిన వాళ్ల ఫోటో పక్కన పెట్టి చనిపోయినట్లు చిత్రీకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి స్కిట్లు చూసినప్పుడు చాలా బాధగా అనిపించిందని తెలిపింది. అయితే పావలా శ్యామల భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత…కూతురిని అల్లారుముద్దుగా చూస్తుండేవారు. కూతురు పెద్దయ్యాక, అమ్మకి తోడుగా షూటింగ్‌లకు వెళ్లేది. కానీ మూడేళ్ల క్రితం కూతురు కిందపడి ఒక కాలు విరిగిపోయింది. కాలికి ఐరన్‌ రాడ్లు వేశారు. ఈ పరిస్థితిలో ఆమె ఇంట్లోనే ఉండిపోయింది.

వయస్సు మీద పడటంతోపాటు కూతురు పరిస్థితిని చూసి కుంగిపోయింది. సడెన్‌గా గుండెపోటుతో హాస్పిటల్‌లో చేరారు. హార్ట్‌కి హోల్స్‌ ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఆపరేషన్‌కి డబ్బులు లేకపోవడంతో మందులతో కొన్నాళ్లు నెట్టుకొచ్చింది. ఆ తర్వాత ఆమె మంచానికే పరిమితమయ్యారు. కనీసం తినడానికి తిండి లేదు, చూసుకోవడానికి మనిషి కూడా లేడని వాపోయింది. ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు తల్లీకూతురు. ఇంత దీనస్థితిలో ఉన్న పావలా శ్యామలపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి.

తనకి సహాయం చేయడానికి వచ్చిన వారిని ఎలాంటి సహాయం వద్దని ఆమె అన్నట్లు ప్రచారం జరిగింది. తాను అస్సలు అనలేదని ఆమె వాపోయారు. కరాటే కళ్యాణే తన గురించి తప్పుగా ప్రచారం చేసినట్లు చెప్పుకొచ్చారు. తన జీవితాన్ని చూసి భగవంతుడికే భయం వేస్తుందని చెప్పారు శ్యామల. కళాకారులకే కన్నీరు పెట్టించాడని వాపోయారు. ఒక్క చిరంజీవి మాత్రమే తనకు సాయం చేశారన్నారు పావలా శ్యామల. ‘మా’ కూడా ఎలాంటి సహాయం చేయలేదన్నారు.

ఇప్పుడు అనాధాశ్రమంలో ఉంటున్న తనను, తన కూతురు చూసేవారే లేరంటూ కన్నీటి పర్యంతమయ్యారు శ్యామలమ్మ. పావలా శ్యామల ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. సాయం చేయకపోగా, తనపై ఆరోపణలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *