పల్లవి ప్రశాంత్ గురించి సంచలన నిజాలు తెలిపిన తల్లిదండ్రులు.

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన సమయంలో పల్లవి ప్రశాంత్ ఎంతో రిజర్వ్డ్ గా ఉన్నాడు. పలకరిస్తే మాట్లాడటం, లేదంటే సైలెంట్ గా ఉండటం చేశాడు. ఎంతో వినయంగా ఉంటూ వచ్చాడు. అయితే కొంతమంది బయట ప్రశాంత్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. వాళ్లకి చాలా పొలం ఉందని.. కోటీశ్వర్లు అని వార్తలు సర్కులేట్ చేస్తున్నారు. అయితే ఈ ప్రచారాన్ని తప్పు పట్టారు పల్లవి ప్రశాంత్ పేరెంట్స్.

తమకి కేవలం 6 ఎకరాలు పొలం మాత్రమే ఉందని వెల్లడించారు. నాలుగు కార్లు ఉన్నాయి అంటున్నారని.. తమకు ఒక కారు కూడా లేదన్నారు. పొలం దున్నుకునేందుకు ఓ ట్రాక్టర్ మాత్రం ఉందని చెప్పుకొచ్చారు. కొంతమంది కావాలనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ద్వారా సంపాదించిన డబ్బును పేద రైతులకు ఇస్తాను అని చెప్పిన విషయం తెలిసిందే. ఈయన మాటలు విన్న తల్లిదండ్రి చాలా సంతోషించారు.

ఇదే విషయాన్ని తెలిపారు కూడా. అమర్ దీప్ తమ బిడ్డను తిట్టడం మాత్రం తమ మనసును కలిచివేసిందని పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ తెలిపారు. 13 ఏళ్ల నుంచి ప్రశాంత్ వ్యవసాయ పనులు చేసేవాడని.. కొందరు ఫ్రెండ్స్ అతడిని మోసం చేశారని వెల్లడించారు. ఆ ఇంట్లో శివాజీ తమ బిడ్డను కాపాడుతూ తనకు సపోర్ట్ చేయడం మరింత సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *