బిగ్‌బాస్ లో బిగ్ ట్విస్ట్, పల్లవి ప్రశాంత్‌ ఎలిమినేట్.

తెలుగు బిగ్‌బాస్ ఇప్పటి నుంచే మొదటి ఫైనలిస్ట్ ని సెలెక్ట్ చేసే ప్రక్రియ నడుస్తుంది. ఈక్రమంలోనే ‘టికెట్ టూ ఫినాలే’ అంటూ పలు టాస్క్ లు ఇస్తూ వస్తున్నాడు బిగ్‌బాస్. మంగళవారం ఈ రేస్ నుంచి శివాజీ, శోభా ఎలిమినేట్ అవ్వగా, బుధవారం ప్రియాంక కూడా ఎలిమినేట్ అయ్యింది.

ఇక గురువారం ఎపిసోడ్ కూడా మరికొన్ని టాస్క్ లతో పోటీపోటీగా సాగింది. అయితే బిగ్ బాస్ ఫైనల్ అస్త్ర టాస్కులో భాగంగా ముందుగా దీని నుంచి శివాజి, శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యారు. వాళ్లు తమ పాయింట్లను అమర్‌దీప్ చౌదరికి ఇచ్చారు. ఆ తర్వాత ప్రియాంక జైన్ కూడా ఔట్ అయింది. ఆమె పాయింట్లను గౌతమ్‌కు ఇచ్చేసింది. అనంతరం యావర్ ఎలిమినేట్ అవడంతో తన పాయింట్లను పల్లవి ప్రశాంత్‌కు ఇచ్చాడు.

దీంతో పోటీ రసవత్తరంగా మారింది. వాస్తవానికి ఫైనల్ అస్త్ర రేసులో పల్లవి ప్రశాంత్ అద్భుతంగా ఆడాడు. అతడితో పాటు అర్జున్ కూడా తనదైన ఆటతీరును కనబరిచాడు. దీంతో ఈ రేసులో వీళ్లిద్దరే టాప్ 2 స్థానాల్లో ఉండాల్సింది. కానీ, పాయింట్లను ఇవ్వడం అనే కాన్సెప్టును తీసుకు రావడంతో అమర్‌దీప్ అందరి కంటే టాప్‌లో నిలిచాడు. ఇప్పుడు ప్రశాంత్ దీని నుంచి వెళ్లిపోవడం బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *