అల్లుఅర్జున్ విషయంలో నాన్న అందరికి ఒక్కటే చెప్పాడు : నిహారిక

నిహారిక.. ఆమె తెలుగు సినిమాకు తెరంగేట్రం చేసే ముందు టెలివిజన్ లో వ్యాఖ్యాతగా పనిచేసారు. ఆమె తెలుగూ టెలివిజన్ ఛానల్ “ఈటీవీ”లో నిర్వహింపబడు తెలుగు డ్యాన్స్ రియాలిటీ షోలు అయిన ఢీ జూనియర్స్-1, ఢీ జూనియర్స్-2 లకు ఆంకర్ గా పనిచేసింది. ఆమె తెలుగు భాషలో వెలువడిన లఘు చిత్రం “ముద్దపప్పు ఆవకాయ్”లో నటించారు, నిర్మించారు.

ఈ సిరీస్ యూట్యూబ్ లో రిలీజ్ అయింది. అయితే ఎన్నికల ప్రచారం సమయంలో హీరో అల్లు అర్జున్.. పవర్ స్టార్ కు మద్దతుగా పోస్ట్ పెట్టి వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లడం పెద్ద దూమారం రేపింది. నంద్యాలలో వైసీపీ తరఫున పోటీ చేసిన తన స్నేహితుడు శిల్పా రవి ఇంటికి వెళ్లి బన్నీ విషెస్ తెలిపారు. దాన్ని పవన్ ఫ్యాన్స్ తప్పు పట్టారు. సోషల్ మీడియాలో బన్నీ అభిమానులు, పవన్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధమే నడించింది. ఇంతలో నాగబాబు చేసిన ఒక్క ట్వీట్ మరింత అగ్గి రాజేసింది.

ఇక పవన్ గెలిచాక.. చిరంజీవి ఇంట్లో సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. మెగా ఫ్యామిలీ అంతా అటెండ్ అయినా.. అల్లు కుటుంబం నుంచి ఎవరూ కనిపించలేదు. పవన్ ను కలిసి విషెస్ చెప్పినట్లు కూడా ఎక్కడా వార్తలు లేదు. దీంతో రెండు ఫ్యామిలీల మధ్య గ్యాప్ పెరిగిందని టాక్ వచ్చింది. అదే సమయంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ తోపాటు స్నేహా రెడ్డిని అన్ ఫాలో చేసినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *