పెళ్లి తర్వాత హన్సిక ఎలా మరిపోయిందో మీరే చుడండి.

సౌత్ యాక్టరస్ హన్సిక మోత్వానీ బాల నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. అటుపై దక్షణాదిలో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ నటిగా ఓ వెలుగు వెలిగింది. దేశముదురు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తర్వాత కన్నడలో కూడా పెద్ద సినిమాల్లో యాక్ట్ చేసి స్టార్ హీరోయిన్‌ స్టేటస్‌ తెచ్చుకుంది. హన్సికా మోత్వానీకి దేశముదురు తర్వాత టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వచ్చాయి.టాప్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది హన్సిక. తెలుగులో కంటే కూడా తమిళ్‌లో ఎక్కువ సినిమాల్లో యాక్ట్ చేసింది ఈ క్యూట్ బ్యూటీ. అయితే దేశముదురు చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు.

ఇక కోలీవుడ్లో ధనుష్‌ సరసన మాప్పిళై చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ఇక్కడ వరుసగా అవకాశాలు వరించాయి. విజయ్‌కు జంటగా వేలాయుధం, సూర్య సరసన సింగం 2, శింబుతో వాలు, జయంరవికి జంటగా రోమియో జూలియట్, కార్తీ సరసన బిరియానీ ఇలా ఇక్కడ స్టార్‌ నటులతో నటించినా హన్సిక తెలుగులోనూ జూనియర్‌ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ వంటి పలువురు హీరోలతో నటించి పాపులర్‌ అయ్యారు. హిందీ, మలయాళం భాషలతో కలిసి అర్ధ సెంచరీ దాటేశారు.

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతుల్లో పలు చిత్రాలు ఉన్నాయి. మొదట్లో కాస్త బొద్దుగా ఉండడంతో ఈమెను చిన్న కుష్బూ అని పిలిచేవారు. అయితే ఇటీవల బరువు తగ్గి నాజుగ్గా తయారయ్యారు. ఇటీవల యోగా దినోత్సవం సందర్భంగా తను యోగాసనాలు చేస్తున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. బాగా స్లిమ్‌గా ఉండడంతో హన్సిక సన్నబడడానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు అనే కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. వాటిపై స్పందించిన హన్సిక తాను ఇలా కనిపించడానికి కఠిన శ్రమ అవసరం అయ్యిందన్నారు. యోగా కూడా ఇందుకు చాలా తోడ్పడిందని ఆమె పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *