జగన్ మోహన్ రెడ్డి రాజకీయవేత్తగా విధులు నిర్వహిస్తూ ఉండగా, భారతి రెడ్డి కూడా పారిశ్రామిక రంగంలో ఉన్నారు. ఎన్నో వ్యాపారాలను భారతి చూసుకుంటున్నారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన భారతి తండ్రి గంగిరెడ్డి పులివెందులలో ఎంతో పేరుపొందిన పీడియాట్రీషియన్.
భారతి ప్రముఖ సిమెంట్స్ తయారు చేసే సంస్థ భారతి సిమెంట్స్ కి చైర్మన్ గా ఉన్నారు. అలాగే సాక్షి ఛానల్, పేపర్ కి సంబంధించిన బాధ్యతలను కూడా భారతి నిర్వహిస్తున్నారు. వారిద్దరికీ హర్షా రెడ్డి, వర్షా రెడ్డి అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.
అయితే వీరిద్దరి పెళ్లి రోజు నాడు పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ కేవలం పార్టీ కార్యకర్తలు మాత్రమే కాకుండా అభిమానులను కూడా సోషల్ మీడియా ద్వారా జగన్ మోహన్ రెడ్డికి, భారతి రెడ్డి కి వారి విషెస్ తెలిపారు. గత సంవత్సరం వారిద్దరి 25వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న జగన్ మోహన్ రెడ్డి దంపతులు ఈ సంవత్సరం కూడా వారి యానివర్సరీ జరుపుకున్నారు.