మహేష్ ప్రజలకు ఎంతో సేవ చేస్తారు కానీ.. ఎవ్వరికీ చెప్పుకోరు. తనను తాను అస్సలు ప్రమోట్ చేసుకోరు. తమకు సాయం కావాలని ఎవరైనా తన దగ్గరికి వెళ్తే వెంటనే తనకు తోచిన సాయం చేస్తారు. టాలీవుడ్ లో చాలామంది హీరోలు ఉన్నా మహేశ్ బాబు రూటే వేరు. అయితే మహేష్ మాత్రమే కాదు ఆయన కుటుంబ సభ్యులు ఆఖరికి మహేష్ కూతురు.. సితార కూడా తన మొదటి సంపాదన చారిటీకి ఇవ్వడం విశేషం.
ఇటువంటి మహేష్ బాబుకి కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలని డిసైడ్ కావటం జరిగింది అంట. ఈ క్రమంలో మహేష్ బాబు చిన్నపిల్లలకు ఉచితంగా చేపిస్తున్న గుండాపరేషన్లకు 3000 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ తో కూడిన హాస్పిటల్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మహేష్ బాబు బంధువు తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ఈ విషయంలో కేంద్ర పెద్దలతో మాట్లాడినట్లు సమాచారం.
ఇదే సమయంలో బిజెపి నాయకులు సైతం మహేష్ చేసే మంచి పనులు తెలుసుకొని.. కేంద్ర పెద్దలకు స్పెషల్ రిక్వెస్ట్ కూడా చేసినట్లు.. త్వరలో మహేష్ చేపట్టే గుండాపరేషన్లకు హాస్పిటల్ రెండు తెలుగు రాష్ట్రాలలో కట్టించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంతగా మహేష్ బాబుకి ప్రాధాన్యత ఇవ్వటం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ షాక్ అయినట్లు సమాచారం.