భారతీయ సినీ చరిత్రలో అత్యంత విలువైన ముద్దు అనగానే చాలామంది దయావన్ సినిమాలోని సీన్ అని చెప్పేస్తుంటారు.1988 లో థియేటర్లలోకి విడుదలైన ఈ సినిమాను ఫిరోజ్ ఖాన్ డైరెక్ట్ చేయగా వినోద్ ఖన్నా, మాధురీ దీక్షిత్ కలిసి నటించారు. అయితే 1988లో థియేటర్లలో సూపర్ హిట్ అయిన దయావన్ సినిమాలో వినోద్ ఖన్నా, మాధురీ దీక్షిత్ జంటగా నటించారు. ఇందులో హీరోహీరోయిన్లు మధ్య ఓ లిప్ లాక్ సీన్ ఉంది. ఈ సన్నివేశం అప్పట్లో పెద్ద రచ్చ చేసింది. ఎందుకంటే అప్పటికే మాధురీ స్టార్ హీరోయిన్ కూడా.
అలాంటి అగ్ర కథానాయిక ఏ కారణంతో ముద్దు సీన్ లో నటించాల్సి వచ్చిందా అని సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికీ ఆ లిప్ లాక్ సీన్ పై అనేక ప్రశ్నలు ఎదురవుతుంటాయి. తాజాగా ది ఫేమ్ గేస్ సిరీస్ ప్రమోషన్లలో మరోసారి మాధురీకి ఈ ప్రశ్నే ఎదురైంది. దీనిపై స్పందించిన మాధురీ ఆసక్తికర వి,యాలను బయటపెట్టారు. “నేను ఆ సన్నివేశంలో నటించాల్సి ఉండకూడదు. ముఖ్యమైనది కాకపోయినా సరే ఆ సీన్ పెట్టారనిపిస్తుంది. నేను దానికి నో చెప్పి ఉండాల్సింది. ” అని క్లారిటీ ఇచ్చింది.
అంతేకాకుండా.. ఈ సీన్ తోపాటు.. ఈ సినిమాలో నటించేందుకు మాధురీ దీక్షిత్ భారీ మొత్తంలో అప్పట్లోనే కోటి రూపాయాల రెమ్యునరేషన్ ఇచ్చారని.. అందుకే ఆమె నో చెప్పలేకపోయిందని అంటున్నారు ఫిల్మ్ వర్గాలు. ఈ సన్నివేశంతోపాటు.. లిప్ లాక్ చేసినందుకు ఆమెకు అప్పట్లోనే కోటి రూపాయాలు ఇచ్చారని సమాచారం. ఇప్పుడు ఇదే విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా తర్వాత ఆమె ఇకపై కిస్ సీన్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యారట. 2002లో దేవదాస్ వరకు వరుస చిత్రాలతో అలరించింది. బాలీవుడ్ నుండి కొంత విరామం తీసుకుని 2007లో ఆజా నాచ్లేతో తిరిగి వచ్చింది.