చంద్రబాబును కలిశారు లోకేష్ . ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. జగన్కు వ్యతిరేకంగా చేయాల్సిన పోరాటంతో పాటు తెలంగాణ ఎన్నికల గురించి కూడా చంద్రబాబు ఆరా తీసినట్లు తెలిసింది. ములాఖత్ అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడిన నారా లోకేష్.. వైసీపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘స్కిల్ డెవలప్మెంట్ కేసులో దమ్ముంటే సీఐడీ, ప్రభుత్వం ఆధారాలు చూపాలి.
వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైల్లో ఉంచారు. బెయిల్పై జగన్ పదేళ్లు ఎలా బయట వున్నారు..?. బాబాయిని చంపిన ఎంపీ అవినాష్ రెడ్డి కూడా రోడ్డుపై తిరుగుతున్నారు. ఏ తప్పు చేయని చంద్రబాబును 50 రోజులుగా జైల్లో పెట్టారు. 50 రోజులుగా స్కీల్ కేసులో ఏ చిన్న ఆధారం కూడా ప్రభుత్వం చూపించలేకపోయింది. చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేసి 50 రోజులుగా జైల్లోనే ఉంచారు.
ఏపీలో వ్యక్తిగత కక్ష సాధింపులు చూస్తున్నాం. చంద్రబాబు చనిపోవాలి.. చంద్రబాబును చంపేస్తామని వైసీపీ నేతలు బాహాటంగా చెబుతున్నారు. కేసుతో ఎలాంటి సంబంధం లేని నా తల్లి భువనేశ్వరిని కూడా జైలుకు పంపిస్తామని వైసీపీకి చెందిన మహిళా మంత్రి మాట్లాడుతున్నారు. నిజం గెలవాలి అని బస్సుయాత్రతో ప్రజల్లోకి నా తల్లి వెళ్తే ఆమెను కూడా అరెస్టు చేస్తామంటారా?. ఇది ఎంతవరకు సమంజసం.