ప్రపంచకప్ ఫైనల్లో అనూహ్య రీతిలో ఓడిన టీమిండియాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓదార్చారు. ఆదివారం జట్టు ఓడిన అనంతరం స్వయంగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిన ఆయన ఆటగాళ్లను కలిసి మాట్లాడారు. అయితే బౌలింగ్లో బుమ్రా, షమి రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. మెగా టోర్నీలో ఇప్పటిదాకా ఎలాగైతే ఆడుతూ వచ్చారో అదే విధంగా ఆడితే ఫైనల్లో ఆసీస్ను చిత్తు చేయొచ్చు. కొత్తగా ఏదీ ట్రై చేయకుండా తమకు వచ్చిన గేమ్ను కంటిన్యూ చేయాలని, అవే స్కిల్స్ను మరింత బెటర్గా ప్రొజెక్ట్ చేస్తే భారత్ అకౌంట్లో మూడో వరల్డ్ కప్ చేరుతుందని సీనియర్ క్రికెటర్లు అంటున్నారు.
మన జట్టులో బ్యాటింగ్ భారం రోహిత్, కోహ్లీపై ఉంది. ఇప్పటివరకు వీళ్లిద్దరిలో ఎవరు ఒకరు బాగా ఆడుతూ వస్తున్నారు. ఒక మ్యాచ్లో హిట్మ్యాన్ సక్సెస్ అయితే.. మరో మ్యాచ్లో విరాట్ రాణిస్తున్నాడు. ఇద్దరూ బాగా ఆడిన సందర్భాలూ ఉన్నాయి. ఒకవేళ రోహిత్ ఫెయిలైతే.. కోహ్లీ మ్యాచ్ను నిలబెడుతున్నాడు. అదే విరాట్ విఫలమైతే హిట్మ్యాన్ ఆఖరి వరకు ఆడుతున్నాడు. కోహ్లీ ఉన్నాడనే భరోసాతో రోహిత్ స్టార్టింగ్లో హిట్టింగ్కు దిగుతున్నాడు. రోహిత్ మొదట్లోనే బౌలర్లను బాదుతుండటంతో తర్వాత విరాట్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు.
ఈ దిగ్గజ బ్యాటర్లు ఇలా ఆడుతుండటం వల్లే టీమిండియాకు వరుస విజయాలు వచ్చాయి. ఇదే ఊపును ఫైనల్ మ్యాచ్లోనూ కంటిన్యూ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ముఖ్యంగా 10 మ్యాచులు ఆడి 711 రన్స్ చేసిన కోహ్లీని ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు వరించాలని అనుకుంటున్నారు. అయితే ఇంత బాగా ఆడుతున్నా విరాట్ను కొందరు విమర్శించడం హాట్ టాపిక్గా మారింది. రికార్డుల కోసం ఆడుతున్నాడని.. కావాలనే మెళ్లిగా బ్యాటింగ్ చేస్తున్నాడని అతడిపై నెట్టింట ట్రోలింగ్ జరుతోంది.