భరత్ అనే నేను తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ఈ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కియారాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇక ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విదేయ రామా లో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో తెలుగులో పూర్తిగా అవకాశాలు దూరమయ్యాయి. అయితే.. పెళ్లైనా కూడా ఈమెకి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.
దీంతో.. ఇకపై బ్రేక్స్ ఇవ్వకుండా కెరీర్పై ఫోకస్ పెడుతుందని అంతా అనుకున్నారు. కానీ.. ఈ అమ్మడు మాత్రం తల్లి కావాలని ఉందంటూ తాజాగా కుండబద్దలు కొట్టింది. గత నెలలో కియారా పొట్ట కాస్త పెద్దదిగా కనిపించడంతో.. బహుశా గర్భం దాల్చిందేమోనని అంతా అనుకున్నారు. కానీ.. మళ్లీ నాజూకుగా కనిపించడంతో అలాంటిదేం లేదని తేలిపోయింది. అయితే.. తనకు మాత్రం ప్రెగ్నెంట్ అవ్వాలని ఎప్పటి నుంచో ఉందని ఓ ఇంటర్వ్యూలో బాంబ్ పేల్చింది. అయితే.. ఈ వ్యాఖ్యలు ఆమె ఇప్పుడు చెప్పలేదు.
2019లో వచ్చిన గుడ్ న్యూస్ సినిమా రిలీజ్ సమయంలో చెప్పింది. ఇప్పుడు పెళ్లి అవ్వడం, గర్భం దాల్చిందన్న పుకార్లు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో.. ఆ వ్యాఖ్యలు మరోసారి వైరల్గా మారాయి. ప్రెగ్నెన్సీ సమయంలో తనకు నచ్చింది తినొచ్చని, అడ్డు చెప్పేవారే ఉండరని ఆ ఇంటర్వ్యూలో కియారా పేర్కొంది. అంటే.. ఫుడ్ కోసం ప్రెగ్నెంట్ అవ్వాలని అప్పట్లో సరదా వ్యాఖ్యలు చేసింది. ఏదేమైనా.. అమ్మడికి పెళ్లయ్యింది కాబట్టి, ఆలియా భట్లాగే ఈ అమ్మడు కూడా త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తుందేమోనని అనుకుంటున్నారు.