కావ్య కళ్యాణ్ రామ్. గంగోత్రి, ఠాగూర్, బన్నీ లాంటి సినిమాల్లో బాలనటిగా ఆకట్టుకుంది. 2022లో వచ్చిన మసూద మూవీతో కథానాయకిగా మారింది ఈ వయ్యారి. తర్వాత బలగం చిత్రం బ్లక్ బస్టర్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల తార. కీరవాణి తనయుడు శ్రీసింహకి జోడిగా ‘ఉస్తాద్’ చిత్రంలో కథానాయకిగా చేసింది ఈ వయ్యారి. అయితే హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్.. గురించి తెలుగు వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
గతంలో కొన్ని సినిమాల్లో నటించిన బలగం సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఈ సినిమా హిట్తో ఒక్కసారిగా తెలుగులో అవకాశాలు పుంజుకున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తోంది. ఈ భామ ఇటీవల ఉస్తాద్ అనే సినిమాలో నటించింది. కావ్యా కళ్యాణ్ రామ్ బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2003లో వచ్చిన గంగోత్రిలో బాలనటిగా తెలుగు తెరకు అరంగేట్రం చేసింది కావ్యా. ఈ సినిమా ఆమెకు మంచి పేరును తెచ్చింది.
‘వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా మెల్లంగ రమ్మంటా’ అనే పాటలో ఆమె నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బాలు చిత్రంలో కూడ నటించి అదరగొట్టింది. ఇక బలగం ఇచ్చిన బూస్టింగ్ తో ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా మారింది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ తన పర్సనల్ విషయాలు చెప్పింది కావ్య. తన క్రష్ ఎవరో కూడా చెబుతూ కోరిక బయటపెట్టింది. తెలుగు హీరోయిన్ అయిన కావ్య కళ్యాణ్ రామ్..