జబర్దస్త్ నుంచి యాంకర్ రష్మి వెళ్ళిపోవడానికి కారణం ఎవరో తెలుసా..?

యాంకర్ రష్మి.. ఇటు యాంకర్ గా అటు నటిగా తన కెరీర్ ను ఫుల్ స్వింగ్ లో ఉండేలా చూసుకుంటోంది. ఇటీవలే మెగాస్టార్ నటించిన భోళా శంకర్ లో మెరిసింది రష్మి. ఇక తన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టింది ఈ చిన్నది. అదీకాక సుధీర్-రష్మి జోడీకి ప్రత్యేకించి ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి మనందరికి తెలియనిది కాదు. ఇదిలా ఉండగా.. తాజాగా రష్మికి సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది.

అనసూయకు వరుస పెట్టి అవకాశాలు రావడంతో ప్రస్తుతం జబర్దస్త్ కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కమెడియన్స్ కూడా ఒక్కొక్కరు జబర్దస్త్ నుంచి అవుట్ అవుతున్నారు. అయితే తాజాగా కొత్త యాంకర్ రావటంతో. యాంకర్ రష్మీ కూడా వెళ్ళిపోతుందేమో అని అనుమానాలు వస్తున్నాయి. ఇక కొంతమంది మాత్రం రష్మీ కూడా జబర్దస్త్ మానేసింది అని అంటున్నారు. కానీ తాజాగా ఆమె ఆ షో గురించి అందులో తన యాంకర్ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చేసింది. ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది రష్మీ గౌతమ్. అలా యాంకరింగ్ తో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇక గ్లామర్ విషయంలో కూడా యువతను బాగా ఆకట్టుకుంటుంది. వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది. కానీ తనకంటూ క్రేజ్ మాత్రం బుల్లితెర పైనే సంపాదించుకుంది. సోషల్ మీడియాలో నిత్యం ఫోటోలు, వీడియోల షేర్ లతో బాగా బిజీగా ఉంటుంది. వ్యక్తిగతంగా కూడా రష్మీ కి మంచి పేరు ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *