ఒకప్పుడు చిన్న వయసులోనే వివాహం చేసేవారు. దాంతో మరొకరి పైకి మనసు మళ్లే అవకాశం ఉండేది కాదు. దాంతో అక్రమసంబంధాలు తక్కువ కనిపించేవి. ప్రస్తుత జీవితంలో తమ జీవిత భాగస్వామిని పట్టించుకోకుండా ఉండటం. ఉద్యోగంలో ఉన్న టెన్షన్స్ వల్ల ఆఫీసు లోనే ఎక్కువ సమయం గడపడం దాంతో కుటుంబాన్ని పట్టించుకోకపోవడం. లాంటి కారణాల వల్ల కూడా ఈ సంబంధాలు పెరిగిపోతున్నాయి. దంపతుల్లో చాలామందికి ఇతరులతో తమ జీవిత భాగస్వామిని పోల్చి చూసుకునే బలహీనత ఉంటుంది.
తాను ఆశించినట్టు భర్త లేడనో, సంసార సుఖం విషయాన్ని పట్టించుకోవడం లేదనో అసంతృప్తికి లోనవుతుంటారు. ఈ అసంతృప్తిలో వివాహేతర సంబంధాల ఉచ్చులో పడుతుంటారు. విషయం బయటపడ్డాక కాపురాలు కూలుతుండటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. వివాహేతర సంబంధాలు విభేదాలకు కారణమై చివరికి విడాకుల వరకు వెళ్తున్నాయి. ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారిలోనూ ఈ సమస్య ఉండటం, అదీ పెళ్లయ్యాక గోల్డెన్ పీరియడ్గా చెప్పుకునే మూడేళ్లలోపే ఈ సమస్యలు రావడం గమనార్హం.
ఓ సర్వే ప్రకారం మన దేశంలో ఏటా విడాకులు తీసుకుంటున్న జంటలు 13 లక్షల 60 వేల మంది వరకు ఉన్నారని అంచనా. విడాకులు తీసుకుంటున్న వారిలో విడిగా ఉండేందుకు ఇష్టపడుతున్న మహిళల సంఖ్య అధికం. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. మిజోరాంలో విడాకుల కేసులు అధికంగా ఉంటున్నాయి. అలాగే కులాంతర వివాహాలు అక్కడే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలా ఒంటరిగా ఉండే మహిళలు కూడా పరాయి పురుషుని సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారు.