హనీ రోజ్ వరగేసే భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2005లో మలయాళంలో విడుదలైన ‘బాయ్ ఫ్రెండ్’ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టి మలయాళంతో పాటు కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది. హనీ రోజ్ తెలుగులో తొలిసారి ఆలయం, ఈ వర్షం సాక్షిగా సినిమాల్లో నటించి నందమూరి బాలకృష్ణ హీరోగా వీర సింహా రెడ్డి107వ సినిమాలో హీరోయిన్గా నటించారు.
అయితే హానీరోజ్ 2005లో 14వ ఏట తన యాక్టింగ్ కెరీర్ను ప్రారంభించింది. ఇక ఆ తర్వాత తెలుగులో కూడా ఇంతకు ముందు రెండు సినిమాలు చేసింది. ముత్యాల సుబ్బయ్య 50వ చిత్రం ఆలయంలో హనీ రోజ్ నటించింది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా అనే పేరుతో వచ్చిన తెలుగు సినిమాలో హానీరోజ్ నటించింది. హానీరోజ్ మొదటి తమిళ చిత్రం ముధల్ కనవే. వీరసింహారెడ్డి సినిమాతో హానీరోజ్కు కావాల్సినంత పాపులారిటీ వచ్చింది. దీంతో ప్రస్తుతం తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ భామకు ఇటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో పాటు అటు గ్లామర్ పాత్రలు కూడా వస్తున్నట్లు టాక్. చూడాలి మరి తెలుగులో ఈ భామ భవిష్యత్తు ఎలా ఉండనుందో.. ఎన్నేళ్లు ఇక్కడ పాగా వెయ్యనుందో.. ఇక బాలయ్య వీరసింహారెడ్డి విషయానికి వస్తే.అఖండ సినిమా తర్వాత బాలయ్య వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా గోపీచంద్ మలినేనితో వీరసింహారెడ్డి అనే సినిమాను చేశారు.