గొంతు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారా..? ఈ ఇంటి చిట్కాలతో వెంటనే తగ్గిపోతుంది.

ఎక్కువ చల్లదనం ఉన్న పదార్థాలు, ద్రవపదార్థాలు తిన్నా,తాగినా ఇలాంటి ఇబ్బంది వస్తుంది. లేదా ఎక్కవ కారం ఉన్న, మసాలా పదార్థాలు ఉన్నవి తీసుకున్నా గొంతుపై ప్రభావం చూపిస్తుంది. ప్రతి ఇంట్లో పసుపు తప్పకుండా ఉంటుంది. దీనిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఎక్కువ. గొంతులో మంట విపరీతంగా ఉంటే.. పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని తాగాలి. అయితే వ్యాధి నిరోధక శక్తి ఓడిపోతున్నప్పుడు మ్యూకస్ (కఫం లేదా శ్లేష్మం) ఏర్పడుతుంది. అది గొంతుకు అడ్డం పడుతుంది.

జలుపు, జ్వరం, అలెర్జీలు, కాలుష్యం, పొగ వంటివి గొంతు గరగరకు దారితీస్తాయి. ఈ కఫానికి ఆరంభంలోనే చెక్ పెట్టాలి. లేదంటే అది దగ్గును క్రియేట్ చేస్తుంది. ఆ దగ్గు రెండు వారాల కంటే ఎక్కువసేపు ఉంటే… ప్రాణాంతకమైన క్షయ వచ్చే ప్రమాదం ఉంటుంది. పసుపు, పాలు .. గోరు వెచ్చని పాలలో… అర టీ స్పూన్ పసుపు వేసి… కలిపి తాగాలి. కావాలంటే కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. గొంతులో గరగర మాయమవ్వడమే కాదు.

గొంతులో హాయిగా అనిపిస్తుంది కూడా. అల్లం, దాల్చినచెక్క.. అల్లాన్ని పేస్ట్ చేసి, దాల్చిన చెక్కను పొడి చేసి, వాటితో టీపొడి కలిపి టీ పెట్టుకొని తాగేయండి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే ఫలితం కనిపిస్తుంది. చక్కటి ఫలితం ఉంటుంది. కావాలంటే కాస్త తేనె కూడా కలుపుకోవచ్చు. అల్లం టీ.. అల్లంలో బ్యాక్టీరియాలను చంపే గుణాలున్నాయి. గొంతులో మంటను తగ్గించే లక్షణాలున్నాయి. కాబట్టి… అల్లాన్ని మెత్తగా నూరి… టీలో కలిపి ఐదు నిమిషాలు మరిగించి తాగితే ఉంటుంది చూడండి… గొంతులో కిచ్ కిచ్ మొత్తం మాయమవుతుంది.

పుదీనా టీ.. పుదీనా చేసే మేలేంటో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. పుదీనా ఆకుల్ని నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి… ఆకులు తీసివేసి… వాటర్ తాగాలి. అంతే… గొంతు అంతు చూస్తుంది. మ్యూకస్ పెట్టే బెడా సర్దుకోవాల్సిందే. చామంతి టీ.. ఇది పెద్దగా తెలియకపోయి ఉండొచ్చు. నిజానికి ఇది కూడా బాగా పనిచేస్తుంది. కొన్ని చామంతి రేకుల్ని నీటిలో వేసి… మరిగించి తాగడమే. కావాలంటే కాస్త తేనె కలుపుకోవచ్చు. ఈ టీ బ్యాక్టీరియాను ఉతికారేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *