మహేశ్ గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ, వెంకటేశ్ సైంధవ్ మూవీలు బరిలోకి దిగుతున్నాయి. జనవరి 12న గుంటూరు కారం, హునుమాన్ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఒకేరోజు 2 చిత్రాలు విడుదల ఉండటంతో థియేటర్ల విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. ఒక సినిమాకే ఎక్కువ సింగిల్ స్క్రీన్స్ అప్పజెప్పారంటూ విమర్శలు వచ్చాయి.
అయితే ‘నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చాననేమో.. ప్రతి ఏడాది సంక్రాంతి వస్తే చాలు.. ఏదో ఒక వివాదాన్ని లేవనెత్తుతూ నాపై ట్రోల్స్ చేయడం కొన్ని వెబ్సైట్స్కి పరిపాటైపోయింది. ఏడెనిమిదేళ్ల నుంచి ఇదే తంతు. నిన్నటి ‘హను-మాన్’ ప్రీరిలీజ్ ఫంక్షన్లో చిరంజీగారు ఈ ధియేటర్ల వ్యవహారంపై ఎంతో పాజిటీవ్గా మాట్లాడారు. ‘సమస్యను ఎలా పరిష్కరించాలో దిల్రాజుకి తెలుసు..
ఈ విషయాల్లో తనకు అనుభవం ఉంది’ అంటూ నా గురించి కూడా గౌరవంగా స్పందించారు. ఆ మాటల్ని వేరే విధంగా మార్చి రెండు ప్రముఖ వెబ్సైట్లు పిచ్చి రాతాలు రాశాయ్. మీ వెబ్సైట్ రేటింగ్ పెంచుకోవటానికి వేరే వాళ్లను ఎందుకు బలి చేస్తున్నారు? అంటే దిల్ రాజు ఏం రియాక్టవ్వడు, సర్దుకుని పోతాడు అనుకుంటున్నారా? తాట తీస్తా..’ అంటూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు హెచ్చరిక జారీ చేశారు.