కేరళలో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్ కుమార్ కి ఎన్ ఐ అధికారులు నోటీసులు ఇచ్చారు.. కేరళ రాష్ట్రంలోని విలన్జియం సమీపంలో డ్రగ్స్ పట్టుబడ్డ సమయంలో ఆ కేసులో కీలక నిందితులుగా ఉన్న ఆదిలింగం పైన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది… డ్రగ్స్ తో సంబంధం కలిగి ఉన్న ఆది లింగం కి ఇప్పటికే nia అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ‘మాన్షన్ 24’ ప్రమోషన్స్లో పాల్గొన్న వరలక్ష్మి శరత్కుమార్ డ్రగ్స్ కేసు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తనకు నోటీసులు అందాయంటూ వచ్చిన న్యూస్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు.
డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదన్నారు వరలక్ష్మి. తనకు ఎలాంటి సమన్లు, లేదా ఫోన్ కాల్స్ కానీ రాలేదని క్లారిటీ ఇచ్చారు. ఆదిలింగం అనే వ్యక్తి గతంలో తన దగ్గర ఫ్రీలాన్స్ మేనేజర్గా వర్క్ చేశాడన్నారు. దళపతి విజయ్ ‘సర్కార్’తో పాటు ఆయన తీసుకొచ్చిన మూడ్నాలుగు మూవీస్లో తాను యాక్ట్ చేశానన్నారు వరలక్ష్మి. ‘డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదు. గతంలో నా దగ్గర ఫ్రీలాన్స్ మేనేజర్గా పనిచేసిన ఆదిలింగం తీసుకొచ్చిన మూడ్నాలు సినిమాలు నేను చేశా. అంతేతప్ప ఆయన పర్సనల్ లైఫ్ గురించి నాకేమీ తెలియదు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆదిలింగం పేరుతో వార్తలు వచ్చాయి.
దీనికి ఎలాంటి ఇంపార్టెన్స్ లేకపోవడంతో నా ఫొటోను వాడి ‘వరలక్ష్మి మేనేజర్కు నోటీసులు’ అని న్యూస్ వేస్తున్నారు. అంతేగానీ ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని వరలక్ష్మి శరత్కుమార్ చెప్పుకొచ్చారు. తాను పదేళ్లలో 50 సినిమాలు చేశానని.. ఇదంత ఈజీ కాదన్నారామె. చాలా కష్టపడి ఇక్కడి దాకా వచ్చానని.. తనను ఇంతగా ప్రోత్సహిస్తున్న తెలుగు ఆడియెన్స్కు వరలక్ష్మి థ్యాంక్స్ చెప్పారు. ఇక్కడి వాళ్లు తనను బాగా ఎంకరేజ్ చేస్తున్నారని.. అందుకే హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యానని వరలక్ష్మి పేర్కొన్నారు.