1966లో రంగులరాట్నం సినిమాతో కెరీర్ ఆరంభించిన చంద్రమోహన్ కథానాయకుడిగా దాదాపు 172 సినిమాల్లో నటించారు. అలాగే మొత్తం 932 చిత్రాల్లో నటించి మెప్పించారు.అప్పట్లో చంద్రమోహన్ ను కొత్త హీరోయిన్లకు లక్కీ హీరో అనేవారు. సిరిసిరి మువ్వ సినిమాలో జయప్రద, పదహారే ళ్ల వయసులో శ్రీదేవి తమ నట జీవితం ప్రారంభంలో ఆయనతో నటించి అగ్రకథానాయికలుగా వెలిగారు. అయితే చంద్ర మోహన్ కెరీర్ కి కూడా ఆ చిత్రం మంచి బూస్ట్ ని ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన హీరో గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించాడు.
అయితే కొన్నాళ్ళకు కొత్త హీరోల రాకతో క్రేజ్ ని కోల్పోతూ వచ్చిన చంద్ర మోహన్ ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీ లోకి దూసుకొచ్చాడు..అయితే కొంతకాలం నుండి సినిమాలకు దూరంగా ప్రశాంతవంతమైన జీవితం ని గడుపుతున్నారు..అయితే చాలాకాలం తర్వాత ఇటీవలే ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు చంద్ర మోహన్..ఈ ఇంటర్వ్యూ లో ఆయన జీవితం లో చేసిన ఒక్క పెద్ద పొరపాటు గురించి చెప్పుకొని బాధపడ్డాడు. ఆయన మాట్లాడుతూ ‘ అప్పట్లో శోభన్ బాబు గారు నా మంచి కోరి చెప్పిన ఒక మాట ని లెక్క చెయ్యలేదు.
ఫలితంగా 100 కోట్ల రూపాయిలు నష్టపోయాను..సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు గారి మాట విని కొంపల్లి వద్ద 35 ఎకరాలున్న ద్రాక్ష తోట ని కొన్నాను..కానీ ఆ ప్రాంతం లో రౌడీయిజం ఎక్కువ ఉండేది..కబ్జాలు జరుగుతూ ఉండేవి..నా ద్రాక్ష తోట మీద వాళ్ళ కన్నుపడింది..అది కబ్జాకి గురి అవ్వడం ఇష్టం లేక అమ్మేసాను..శోభన్ బాబు గారు భవిష్యత్తులో అవి కోట్ల విలువ చేస్తాది..అమ్మొద్దు అంటూ ఎంత చెప్పిన వినకుండా అమ్మేసాను..ఇప్పుడు అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది..వందల కోట్ల బిజినెస్ జరుగుతుంది ‘ అంటూ చెప్పుకొచ్చాడు చంద్ర మోహన్.