చంద్రబాబును చూడగానే కొడాలి నాని రియాక్షన్ ఎలా మరిపోయిందో చుడండి.

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌లో కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు చంద్రబాబు. ఈ కేసులో 53 రోజుల పాటు రాజమండ్రి కేంద్ర కారాగారంలో విచారణను ఎదుర్కొన్నారు. అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు.

తాను తిరుమల వెంకటేశ్వరస్వామి వారి పాద పద్మాల వద్ద పుట్టానని, అంచెలంచెలుగా ఎదిగానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. శ్రీవారి ఆశీస్సులతో ప్రజా సేవకు అంకితం అయ్యానని పేర్కొన్నారు. వెంకటేశ్వర స్వామి తమ ఇంటి దైవం, అని ఆయనను తలచుకుని ఏ కార్యక్రమం అయినా ప్రారంభిస్తానని చెప్పారు.

2003లో అలిపిరి వద్ద తనపై 24 క్లెమోర్ మైన్స్ పేలినప్పుడు.. వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టారని చంద్రబాబు అన్నారు. తాజాగా కష్టం వచ్చినప్పుడు కూడా వేంకటేశ్వర స్వామిని మొక్కుకున్నాను, ఆయన దర్శనం తరువాతే వేరే కార్యక్రమాలు మొదలుపెట్టాలని అనుకున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *