కడపలో వైఎస్ వివేకా నందరెడ్డి 5వ జ్ఞాపకార్థ సభలో ఏపీసీసీ APCC అధ్యక్షురాలు షర్మిల పలు వ్యాఖ్యలు చేశారు. హత్యకు గురవడానికి ముందు ఆఖరిసారి తన ఇంటికొచ్చి కడప ఎంపీగా పోటీచేయాలని అడిగారని గుర్తు చేసుకున్నారు.
సాయం చేయడంలో వివేకా ఎప్పుడూ ముందుండేవారని, దాదాపు రెండు గంటలపాటు తనను ఒప్పించే ప్రయత్నం చేశారని, ఎన్నిసార్లు వద్దులే చిన్నాన్న అని చెప్పినా.. ఓపికగా నాతో మాట్లాడారన్నారు.వివేకా చివరి సారి కలిసినపుడు కడప ఎంపీ స్థానానికి పోటీచేయమని గట్టిగా కోరారని,
అన్నీ అనుకూలిస్తే చేస్తాలే అని చెప్పేవరకు చిన్నాన్న వెళ్లలేదన్నారు. తన చిన్నాన్న చనిపోయి ఐదేళ్లు గడిచాయని, చిన్నాన్న చావు నమ్మలేని నిజమని, దుర్మార్గ పాలన చక్రాల కింద నలిగిపోతూ న్యాయం కోసం పోరాటం చేస్తున్న నిప్పులాంటి నిజం అన్నారు.