క్యాన్సర్ని తెలుగులో “కర్క రోగం” అని అంటారు. సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. అయితే మనదేశంలో క్యాన్సర్ కారకాల్లో 70% అందులో 40% పొగాకు
సంబంధించినవి మద్యపానం వల్ల పేగు, రొమ్ము, నోరు, స్వర పేటిక అన్నవాహిక కాలేయం కడుపుతో పాటు ఆరు రకాల క్యాన్సర్ల ముప్పును ఆల్కహాల్ పెంచుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లు ఎటువంటి సంకేతాలు లేకుండా మనిషిని మింగేస్తుంటాయి. మహిళలు పాతిక సంవత్సరాల తర్వాత పాప్స్ నియర్ పరీక్ష చేయించుకోవాలి. ప్రతి మూడు నుంచి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవాలి. ఇక తెల్ల స్రావం, పొత్తికడుపులో నొప్పి నెలసరి కి మధ్య రక్తస్రావం తర్వాత రక్తస్రావం అంటే లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.
నోట్లో ఏదైనా చిన్న పుండు లాగా అయ్యి అది మానకపోతే నిర్లక్ష్యం చేయకుండా పరీక్ష చేయించుకోండి. సడన్గా బరువు తగ్గడం కానీ పెరగడం కానీ రక్తహీనత నీరసం లేదా ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోండి. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే 40,ఏళ్లు దాటిలోపే ఒకసారి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. కాబట్టి క్యాన్సర్ ముప్పులను తగ్గించుకుంటూ లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేసుకుని వైద్యుల సలహా మీద తగిన చికిత్స పొందాలి. ఇలా ముందుగా మేలుకుంటే క్యాన్సర్ ముప్పు నుంచి మనం చాలా వరకు బయటపడొచ్చు.