బిగ్ బాస్ షో లో మొబైల్ వాడుతూ అడ్డంగా బుక్ అయిన లేడీ కంటెస్టెంట్.

బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏ భాషలో వచ్చినా.. అత్యధిక రేటింగ్స్ సాధించిన రియాల్టీ షోలలో ఇది ఒకటి. తెలుగు రాష్ట్రాల గురించి చెప్పాలంటే, బిగ్ బాస్ తెలుగు విజయవంతంగా ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. అయితే బిగ్ బాస్ షో అంతా ఫేక్. జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు. కొందరు ఎదురు డబ్బులిచ్చి షోకి వెళతారు. వాళ్లకు హౌస్లో ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అలా డబ్బులిచ్చి వెళ్లిన కంటెస్టెంట్స్ జోలికి వెళితే వాళ్ళను బయటకు పంపేస్తారని సరయు చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ హౌస్లోకి వెళితే బయటకు వచ్చే వరకు బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు అంటారు. ఇది కూడా అబద్ధమే అని తాజా సంఘటనతో తేలింది. బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 2 నుండి ఓ ఫోటో బయటకు రాగా కంటెస్టెంట్ పూజా భట్ పక్కన మొబైల్ ఉంది. పూజా భట్, ఎల్విస్ యాదవ్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పూజ పక్కన ఉన్న కుర్చీలో మొబైల్ ఉంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజెన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. బిగ్ బాస్ షో అంతా ఫేక్. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటున్నారు.

బిగ్ బాస్ హౌస్ నిబంధనలకు వ్యతిరేకంగా పూజా భట్ మొబైల్ ఎలా వాడతారని ప్రశ్నిస్తున్నారు.తాజా ఫోటో బిగ్ బాస్ షోపై మరిన్ని అనుమానాలు కలగజేసింది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 జూన్ 17న మొదలైంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. జియో సినిమాలో బిగ్ బాస్ ఓటీటీ ప్రసారం అవుతుంది. చివరికి చేరిన ఈ సీజన్ ఫైనలిస్ట్స్ గా పూజా భట్, ఎల్విస్ యాదవ్, బేబిక, అభిషేక్, మనీషా ఉన్నారు. 15 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *