స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంగళవారం కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరులో పర్యటించారు. ఈ సందర్బంగా జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జాబ్క్యాలెండర్ అని, సీపీఎస్ రద్దని, మద్యపాన నిషేధమని ప్రజలను మోసం చేసిన నయ వంచకుడు జగన్ అంటూ ధ్వజమెత్తారు.
కాగా ఏ పల్లెకు వెళ్లినా తమ అభిమాన నటుడు, తెలుగుదేశం నాయకుడు బాలకృష్ణ రాక కోసం గంటలు తరబడి యువకులు, మహిళలు, రైతులు ఎదురు చూశారు. బాలకృష్ణ రాగానే జై బాలయ్య అంటూ హోరెత్తించారు. జనసేన, బీజేపీ కార్యకర్తలు సైతం బాలకృష్ణ యాత్రలో పాల్గొన్నారు. . టీడీపీ విజయం కోసం రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేయనున్నారు.
స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో నందమూరి బాలకృష్ణ బస్సు యాత్ర సాగనుంది. బాలయ్య చేపట్టనున్న బస్సు యాత్ర కోసం ఇప్పటికే ప్రత్యేక బస్సును కూడా సిద్ధం చేశారు. బాలయ్య అన్ స్టాపబుల్ అంటూ బస్సుపై ప్రత్యేక క్యాప్షన్ కూడా ఇచ్చారు. అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి లోగోను ముద్రించారు.
మొత్తం బస్సును టీడీపీ కలర్ అయిన పసుపు రంగుతో ముంచేశారు. అలాగే బస్సు మీద నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటోలను ముద్రించారు.