బాలసుబ్రహ్మణ్యం 1946, జూన్ 4 న నెల్లూరు జిల్లా, కోనేటమ్మపేట గ్రామంలో సాంప్రదాయ వీరశైవ ఆరాధ్య బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించాడు. అతని స్వగ్రామం మొదట గోల్కొండ పాలకుల ఆధీనంలో ఉండేది. ఆ తరువాత 1825 నుండి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమయ్యింది. అయితే ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు అతని భార్య సావిత్రి కూడా అతీతం ఏమీ కాదు.సింగర్ గా ఎస్పీ బాలు చాలా ఏళ్ల పాటు బిజీగానే ఉన్నారు.
ఆయన కరోనా సోకి చివర శ్వాస విడిచే వరకు కూడా ఏదో ఒక రికార్డింగ్ లేదా ఏదో ఒక ప్రోగ్రాం తో సమయాన్ని గడుపుతూ ఉండేవారు. అయితే బాలసుబ్రమణ్యం ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య సావిత్రి మాత్రం కుటుంబం కోసం ఎంతో త్యాగం చేసిందని చెప్పాలి.బాలుని సావిత్రమ్మ పెళ్లి చేసుకునే వరకు ఆమె వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే. ఈ ముగ్గురు చెల్లెల్లు ఒక తమ్ముడు ఉన్నారు అందరూ టీనేజ్ లోనే ఉండేవారు.
కెరీర్ లేదా చదువుల కోసం అందరూ బాలు మద్రాసులో ఉంటే అక్కడే ఉండేవారు. అలా బాలు తోబుట్టువులు నలుగురిని అలాగే వారి పిల్లలు చరణ్ మరియు పల్లవిలను ఎంతో జాగ్రత్తగా చూసుకునేది పొద్దున లేచింది మొదలు భర్తకు పిల్లలకు ఏం కావాలి, మరిదిని రెడీ చేసి బాక్సులు కట్టి స్కూలుకు పంపడం అందరిని జీవితాలను సెటిల్ చేయడం ఆ తర్వాత వారి పెళ్లిళ్లు, పేరంటాలు, ఇంట్లో ఫంక్షన్లు అన్నీ కూడా సావిత్రి దగ్గర ఉండి చూసుకుంది.
ఇలా తన జీవితం మొత్తం కూడా ఎంతో కష్టంగానే గడిపింది.కానీ బాలు పై ఇష్టంతో అన్ని ఎంతో ఓర్పుతో, సహనంతో చేసుకుంటూ వచ్చింది.ఈరోజు మన మధ్యలో ఎస్పీ బాలసుబ్రమణ్యం లేకపోయినా ఆయన రూపంలో ఆయన చేసిన పనులు సినిమాలు మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి కానీ ఇలా కనిపించని ఎన్నో త్యాగాలు వారి వెనుక ఉంటాయి.