చంద్రబాబు అనారోగ్యానికి గురయ్యారని తెలిసినప్పట్నుంచీ ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇవాళ బాబు సతీమణి నారా భువనేశ్వరి ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘బాబుకు సకాలంలో వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. చంద్రబాబు ఇప్పటికే ఐదు కిలోల బరువు తగ్గారు. ఇంకా ఆయన బరువు తగ్గితే అది కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. ఓవర్హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది.
అయితే మూడు నెలల క్రితం చంద్రబాబు ఎడమ కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉందని న్యాయవాదులు పిటిషన్లో పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఏపీ-సీఐడీ అధికారులు సెప్టెంబర్ 9న చంద్రబాబును అరెస్ట్ చేశారు. రిమాండ్లో భాగంగా నెల రోజులకు పైగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నందున ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని నాయుడు తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు కేసులో 17ఏని పరిగణనలోకి తీసుకోలేమని ఏపీ-సీఐడీ తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ వాదించారు. ఇరుపక్షాల తీర్పులను విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది. అక్టోబర్ 28న తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఏపీ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి చంద్రబాబు ముందస్తు బెయిల్పై వేసిన పిటిషన్ను అక్టోబర్ 29న సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది.
ఏ కేసులోనూ బాబుగారికి ఊరట , బెయిల్ దక్కే అవకాశాలు లేకపోవడం.. వరుస కేసులను జగన్ సర్కార్ వెలికి తీసి మరీ పెడుతుండడంతోనే ఇక చంద్రబాబు కంటి ఆపరేషన్ ను సాకుగా చూపి బెయిల్ పొందాలని కొత్త స్కెచ్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది.