ఈ సభలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్రెడ్డిపై తీవ్ర ఆగ్కరహం వ్యక్తం చేశారు. ఈ సభకు టీడీపీ, జనసేన శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వం ప్రారంభమైంది. ఒక్కో సభకు లక్ష మంది తగ్గకుండా హాజరవుతారని తెలుగుదేశం అంచనా వేస్తోంది.
పలు సభల్లో చంద్రబాబు – పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొనున్నారు. ప్రజలకు స్వర్ణయుగం తెలుగుదేశం – జనసేన తోనే సాధ్యమనే వాదాన్ని బలంగా తీసుకెళ్లేలా సభల నిర్వహణ రాష్ట్రాన్ని ఆందోళనప్రదేశ్గా మార్చిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడదా౦ నినాదంతో సభల నిర్వహిస్తున్నారు.
కొన్ని రోజులు రోజుకు రెండేసి బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉన్నందున రవాణా సౌకర్యార్ధం చంద్రబాబు హెలికాఫ్టర్ను వినియోగిస్తున్నారు.