చంద్రబాబు అరెస్టుపై స్పందించిన హీరో విశాల్‌, భయమేస్తుందంటూ..?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తూ … కీలక వ్యాఖ్యలు చేశాడు హీరో విశాల్ కృష్ణారెడ్డి. ఇటీవల కాలంలోనే హీరో విశాల్ మార్క్ ఆంటోనీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే తన లేటెస్ట్‌ మార్క్‌ ఆంటోనీ సక్సెస్‌ మీట్‌ కోసం హైదరాబాద్‌ వచ్చారీ స్టార్‌ హీరో. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్ట్‌ గురించి జర్నలిస్ట్‌ ప్రశ్నించగా..’ నేను ఇక్కడ ఓటు వేయలేదు. తమిళనాటులో ఓటు వేశా. ఓ కేసు విషయంలో చంద్రబాబును రిమాండ్‌కు పంపారు.

అయయితే ఆయనను అరెస్ట్‌ చేసే ముందు బాగా ఆలోచించాల్సింది. ఎందుకంటే చంద్రబాబు లాంటి ఓ ప్రముఖ రాజకీయ నేతకే ఇలా జరిగిందంటే నాలాంటి సామాన్యుడికి భయమేస్తోంది. నా ప్రచారంలో బిజీగా ఉండడం వల్ల ఆ పరిణామాలను నేను లోతుగా పరిశీలించలేదు. ఏది ఏమైనా చివరకు న్యాయమే గెలుస్తుందనుకుంటున్నా. మేం బయట హీరోలు కావొచ్చుగానీ ఇంట్లో సామాన్యులమే’ అని విశాల్‌ పేర్కొన్నారు. కాగా విశాల్‌ రాజకీయ ప్రవేశంపై గతంలో కొన్ని రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే.

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తాడని ఓ ప్రముఖ రాజకీయ పార్టీ తరఫున కుప్పంలో పోటీ చేస్తాడని పుకార్లు కూడా వచ్చాయి. అయితే తన పొలిటికల్ ఎంట్రీపై వస్తోన్న వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు విశాల్‌. అయితే తాజాగా చంద్రబాబు అరెస్ట్‌పై హీరో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. విశాల్ నటించిన తాజా చిత్రం మార్క్ ఆంటోనీ. మార్క్‌ ఆంటోని’. టైం ట్రావెల్ సబ్జెక్టుతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎస్‌ జే సూర్య, సునీల్‌, రీతూ వర్మ, అభినయ, వైజీ మహేంద్రన్, సెల్వ రాఘవన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

అధిక్ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌ 15న తమిళ్‌తో పాటు తెలుగులో కూడా ఈ విడుదలైంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. గ్యాంగ్ స్టర్ డ్రామాకి టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ అంశాలను జోడించి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా మార్క్ ఆంటోనీని తెరకెక్కించారు. జీవి ప్రకాష్ అందించిన బాణీలు కు హైలెట్ గా నిలిచాయి. మినీ స్టూడియో బ్యానర్ పై వినోద్ కుమార్ ఈ ను నిర్మించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *