నా అన్వేషణ. ప్రపంచ యాత్రికుడు..ఇతని పేరు అన్వేష్. మొన్న ఈ మధ్య ఈ సార్ కు తన గురించి తనకే తెలుసుకోవాలనిపించింది. దీంతో గూగుల్ ను అసలు అన్వేష్ ఎవరు అని అడిగాడట. అంతే అడిగిన పాపానికి గూగుల్ మామూలుగా ఆన్సర్ ఇవ్వలేదు. అయితే 2019 లో అన్వేష్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. అన్వేష్ అమెరికాలో షిప్ లో పని చేసేవాడు. అలా పని చేస్తూనే కాళీ సమయంలో వీడియోలు తీసేవాడు. యూట్యూబ్ ఛానల్ పెట్టకముందే 57 దేశాలు షిప్ లో తిరిగేశాడు. అయితే కరోనా వచ్చిన తరువాత జాబ్ డైలామాలో పడడంతో ఇండియాకి వచ్చేశాడు.
ఆ సమయంలోనే ప్రపంచ యాత్ర చేద్దామనే ఆలోచన వచ్చింది అన్వేష్కి. అయితే ముందుగా ఇండియాని చూపించిన తరువాత ప్రపంచ యాత్ర చేయమని కొందరు సలహా ఇవ్వడంతో.. రాజు, పులి, రాము అనే యూట్యూబర్ల తో కలసి భారత ఖండపు యాత్రను ప్రారంభించారు. వందరోజుల్లో భారత దేశాన్ని చుట్టిరావాలని ఈ ప్రోగ్రామ్ థీమ్. ఈ క్రమంలోనే తన దగ్గరున్న ఐఫోన్ లోనే భారత ఖండపు యాత్ర ద్వారా ఇండియాలో ఉన్న ఆలయాలు, వింతలు విడ్డూరాలు అన్ని చూపించాడు. ఈ యాత్రకు సంబందించి మోత్తం లక్ష 50 వేలు పెట్టుబడి పెట్టగా.. లక్ష రూపాయలు ప్రోఫిట్ వచ్చింది.
అందులో 20 వేలు ఖర్చవగా.. మిగిలిన 80 వేల రూపాయలతో వరల్డ్ టూర్ స్టార్ట్ చేశాడు. మొదటి టూర్ కు అయిన ఖర్చులకు, ఆ వీడియో ద్వారా యూట్యూబ్ లో వచ్చిన డబ్బులకు ( రూ. 600 ) పొంతన లేకపోవడంతో నిరుత్సాహానికి గురై ప్లాన్ మార్చుకొని ప్రపంచ యాత్ర తరువాత.. ముందు ఆఫ్రికా ఖండాన్ని చుట్టేద్దామనుకున్నాడు. ఆ క్రమంలో ఆన్వేష్ చేసిన ముర్సీ ట్రైబ్ వీడియో బాగా వైరల్ అయి 5 లక్షల వీక్షణలు లభించాయి.దీంతో ఓర్చుకోలేని ఇతర యూట్యూబర్లు అన్వేష్ పై ఆన్ లైన్ దాడికి దిగారు. అనుకోని పరిస్థితుల్లో అన్వేష్ కూడా ఆ గొడవల్లో దూరాల్సి వచ్చింది.