నేనేమైనా ఆ పని చేస్తున్నానా..? యాంకర్ రశ్మి సీరియస్ వార్నింగ్.

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా రష్మీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ప్రాణ ప్రతిష్ఠ రోజు రష్మీ కాషాయ చీర ధరించి జై శ్రీరామ్ నినాదాలుచేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ కాషాయ చీర కట్టి (డ్యాష్) పనులు చేస్తున్నామని కామెంట్ చేశాడు. దీనిపై రష్మీ పై విధంగా సమాధానం చెప్పింది. అయితే కొంత మంది నెటిజన్లు రష్మీకి సపోర్ట్ గా నిలిచారు.

అయితే యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ రోల్ పోషిస్తారో మనందరికీ తెలుసు. తనను తానూ ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా పలు ఫోటో షూట్స్ పోస్ట్ చేయడంతో పాటు సమాజంలో జరిగే అన్యాయాలు, జంతు బాలి లాంటి ఇష్యూస్ పై ఘాటుగా రియాక్ట్ అవుతుంటారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా అయోధ్య రామ్ మందిర్, హిందుత్వం గురించి పోస్టులు పెడుతోంది రష్మీ గౌతమ్. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై ఆనందం వ్యక్తం చేస్తూ రష్మీ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది.

ఇదే ట్వీట్ రష్మీ ఆగ్రహానికి దారి తీసింది. రష్మీ పెట్టిన పోస్ట్ చూసి కాషాయపు రంగు చీర కట్టి.. అన్నీ చెడ్డ పనులు చేస్తున్నావు.. అంటూ కాస్త అసభ్య పదజాలం వాడాడు. దీంతో రష్మికి ఎక్కడాలేని కోపం వచ్చింది. వెంటనే రిప్లై ఇస్తూ సీరియస్ కామెంట్స్ చేసింది. నేను బిల్లులు కట్టకుండా ఎగ్గొట్టానా ? నా తల్లిదండ్రులను రోడ్డున వదిలేశానా ? నా కుటుంబ బాధ్యతలు తీసుకోలేదా ? ట్యాక్సులు కట్టలేదా ? నేనేమైనా అసాంఘిక కార్యకలాపాలు, ఆకృత్యాలు చేశానా ? ఎవరి దగ్గరైనా డబ్బులు లాగేసుకున్నానా ? అంటూ మండిపడింది రష్మీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *