తారకరత్న మరణించాక భార్య అలేఖ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసా..?

మోహన్‌ కృష్ణ, సీత దంపతులకు 1983లో జనవరి 8వ తేదీన తారకరత్న జన్మించాడు. ఏడవ తరగతి వరకు చెన్నైలో చదువుకున్న తారకరత్న ఆ తర్వాత హైదరాబాద్‌లో భారతీయ విద్యాభవన్‌లో హైస్కూల్‌ విద్యను పూర్తిచేశాడు. ఇక గుంటూరు విజ్ఞాన్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదివాడు. అయితే 23 రోజులు పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న ఫిబ్రవరి 18నా మహా శివరాత్రి రోజు శివసానిథ్యం చేరారు. ఈరోజుకి కచ్చితంగా తారకరత్న మరణించి ఆరు నెలలు గడిచింది.

తారకరత్న మరణించి ఆరు నెలల గడుస్తున్నా కూడా ఆయన జ్ఞాపకాల నుండి ఇప్పటి బయటకు రాలేకపోతున్నారు అలేఖ్య రెడ్డి. ప్రతిరోజూ తారకరత్నను తలచుకుంటూ ఆమె మానసిక వేదన అనుభవిస్తున్నారు అనేది ఆమె సోషల్ మీడియా తారకరత్నతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేయడం ద్వారా అర్థమవుతుంది. తారకరత్న హీరోగా నటించిన నందీశ్వరుడు చిత్రానికి అలేఖ్య రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్ పని చేశారు. అలా వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది.

అప్పటికే అలేఖ్య రెడ్డి పెళ్ళై విడాకులు తీసుకుని ఉండటంతో తారకరత్న ప్రేమను ఆయన తండ్రి మోహన్ కృష్ణ అంగీకరించలేదు. దీనితో తారకరత్న పెద్దలను ఎదిరించి మరీ గుడిలో రహస్యంగా అలేఖ్య రెడ్డిని వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట ఆర్థిక ఇబ్బందులతో అనేక బాధలు అనుభవించారు. కానీ వారి ప్రేమ ముందు ఆ బాధలు సైతం ఓడిపోయాయి. మనోధైర్యంతో ఆర్థికంగా నిలదుక్కుకొని వారికంటూ మంచి జీవితాన్ని ఏర్పరచుకున్నారు. ముగ్గురు పిల్లలతో ఎంతో సంతోషంగా కొనసాగుతున్న వీరి కాపురంపై దేవుడు చిన్నచూపు చూశాడు.

ప్రేమతో ఒకటైన ఈ జంట ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని అందమైన కుటుంబాన్ని ఏర్పరచుకున్నారు. ఈ జంటకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. తారకరత్న మరణంతో అలేఖ్య రెడ్డి జీవితం ఒక్కసారిగా అంధకారం అయిపోయింది. తారకరత్న బ్రతికి ఉన్నప్పుడే అలేఖ్య రెడ్డిని అత్తమామలు ఆమెను పట్టించుకునేవారు కాదు. తారకరత్న మరణం తర్వాత కూడా అలేఖ్య కుటుంబానికి ఎటువంటి సాయం అందలేదని, అలేఖ్య పిల్లల బాధ్యత ఒంటిరిగా నెరవేరుస్తున్నారని సమాచారం వినిపిస్తుంది. అలేఖ్య రెడ్డి కుటుంబ బాధ్యతను తన భుజాలపై వేసుకొని కాస్ట్యూమ్ డిజైనర్ వృత్తిని కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *