అఖిల్ జాతకం గురించి బాంబ్ పేల్చిన వేణు స్వామి, అక్కినేని ఫ్యామిలీకి కూడా..!

ఎంతోమంది సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాడు ఈ సినీ జ్యోతిష్యుడు. ఇంతకీ ఇప్పుడు ఎవరి జాతకం చెప్పాడు అంటారా. అక్కినేని హీరో అఖిల్ జాతకం చెప్పాడు గతంలో అక్కినేని హీరో అయినా నాగచైతన్య గురించి వేణు స్వామి చెప్పిన విషయం నిజమైంది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. అక్కినేని నాగేశ్వర్ రావు నుంచి మూడు తరాల వారు పరిశ్రమలో కొనసాగుతున్నారు.

అక్కినేని నాగర్జున తర్వాత అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ లు హీరోలుగా మారారు. అయితే సినీ పరిశ్రమలో నాగేశ్వరరావు కు, నాగర్జునకు వచ్చిన స్టార్ ఇమేజ్ చైతన్య, అఖిల్ లకు రావడం లేదు. అందుకు కారణం వారి జాతకం లో ఉన్న లోపమే నని వేణు స్వామి ఇప్పటికే వెల్లడించారు. ఇటు పర్సనల్ విషయాల్లోనూ వారిని విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే నాగచైతన్య, సమంతను పెళ్ళి చేసుకుని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.. ఆ తరువాత అఖిల్ నిశ్చితార్థం మధ్యలో ఆగిపోయింది. అయితే నాగ చైతన్య విడాకుల విషయం వేణు స్వామి ముందే చెప్పాడు.

కానీ అప్పట్లో ఎవరూ నమ్మలేదు. అయితే ఆ తర్వాత వేణు స్వామి చెప్పినట్లే వీరు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు అఖిల్ విషయంలోనూ వేణు స్వామి సంచలన విషయాన్ని బయట పెట్టాడు. అఖిల్ జాతకం ఇప్పుడు అస్సలు బాగోలేదని చెప్పాడు. అయితే అయన జాతకం బాగుపడాలంటే ఓ పని చేయాలన్నారు.అఖిల్ ఎప్పటి నుంచి అయితే తల్లి మాట వినడం మానేస్తాడో అప్పుడే అఖిల్ జీవితం బాగుంటుంది.. అని అన్నారు. ఈ విషయం లో నాగార్జున కలగజేసుకుని అఖిల్ జీవితాన్ని చక్కదిద్దాలని అన్నాడు. నాగార్జున చెప్పిన విషయాలను అఖిల్ వింటే జీవితం బాగుంటుంది అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *