ఇండస్ట్రీ లో తీవ్ర విషాదం. గుండెపోటుతో నిండు నెలల గర్భంతో నటి మృతి.

ఎనిమిది నెలల గర్భిణిగా ఉన్న ప్రియా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఇటీవల గుండెపోటుతో బాధపడే ముందు డాక్టర్ ప్రియా ఆసుపత్రిలో రెగ్యులర్ ప్రెగ్నెన్సీ చెకప్‌లు చేయించుకుంది. అదృష్టవశాత్తూ కడుపులో ఉన్న చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ప్రియా బిడ్డ ప్రస్తుతం ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో (ఐసీయూ)లో ఉంది. అయితే ప్రముఖ మళయాలీ నటి రంజుషా మీనన్ ఆత్మహత్య చేసుకున్న షాక్ నుండి సినీ-సీరియల్ పరిశ్రమలు ఇంకా తేరుకోకముందే మరో విషాద ఘటన జరిగింది.

ఇందులో భాగంగా… మళయాలం సీరియల్స్‌ లో యాక్టివ్‌ గా ఉన్న నటి డాక్టర్ ప్రియ కన్నుమూశారు. ఆమె మరణించిన విషయాన్ని బుల్లితెర నటుడు కిషోర్ సత్య తన సోషల్ మీడియా పేజీ ద్వారా తెలియజేశారు! రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లిన ప్రియకు నిన్న హఠాత్తుగా గుండెపోటు వచ్చిందంట. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిందని చెబుతున్నారు. మరణించే సమయానికి ఆమె 8 నెలల గర్భవతి కావడంతో ఈ విషాదం రెట్టింపయ్యింది! దీంతో ఆమె మృతదేహానికి ఆపరేషన్ చేసిన వైద్యులు శిశువును బయటకు తీశారు.

ఇంకా పూర్తిగా నెలలు నిండకపోవడంతో ఆ శిశువును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా… సరిగ్గా రెండు రోజుల క్రితం సినీ, సీరియల్ నటి రెంజూషా మీనన్ (35) మరణించిన సంగతి తెలిసిందే. తిరువనంతపురంలోని ఆమె ఫ్లాట్ లో ఉరివేసుకుని విగతజీవిగా వేళాడుతూ ఉంది. ఆమె సీరియల్స్‌ లో లైన్ ప్రొడ్యూసర్‌ గా కూడా పనిచేసింది. దాదాపు 20 సీరియల్స్‌ లో నటించింది! అయితే ఈ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు! ఇలా వరుస మరణాలు సంభవిస్తుండటంతో మళయాలం టీవీ-సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో ఉంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *