అనారోగ్యం బారినపడిన రాకేష్ మాస్టర్ గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన పక్కనే ఉంటూ యోగక్షేమాలు చూసుకుంటున్న ఆలేటి ఆటం మొదట ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆర్థిక కారణాలతో చివరి నిమిషంలో గాంధీ ఆసుపత్రికి చేర్చారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రాకేష్ మాస్టర్ వీడియోలు కలచివేశాయి. అయితే ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణం అందరినీ తీవ్రంగా కలిచివేసింది. సుమారు 1500 సినిమాలకు డ్యాన్స్ మాస్టర్గా పనిచేశారాయన.
అలాగే సత్య, జానీ, శేఖర్ మాస్టర్ల లాంటి స్టార్ కొరియోగ్రాఫర్లను తీర్చిదిద్ది ఇండస్ట్రీకి అందించారు. ఒకొనాక దశలో టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్గా వెలిగిన ఆయన కొన్ని కారణాలతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే తీవ్ర అనారోగ్యానికి గురై జూన్ 18న తుదిశ్వాస విడిచారు. రాకేష్ మాస్టర్ అకాల మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, శిష్యులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. తమ గురుభక్తిని చాటుకుంటూ జానీ, శేఖర్ మాస్టర్లు రాకేష్ మాస్టర్ పాడెను మోశారు. ఆతర్వాత కూడా సంస్మరణ సభ కూడా నిర్వహించారు.
అందులో రాకేష్ మాస్టర్ అంటే తమకెంతో ప్రత్యేకమో మరోసారి గుర్తుచేసుకున్నారు. ఇదిలా ఉంటే రాకేష్ మాస్టర్ అందించిన సేవలకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని తయారుచేస్తున్నారు. రాకేశ్ మాస్టర్కు అత్యంత సన్నిహితుడు, తన ఆఖరి శ్వాస వరకు పక్కనే ఉండి అన్నీ చూసుకున్న ఆలేటి ఆటం ఈ విగ్రహాన్ని సొంత ఖర్చులతో దగ్గరుండి తయారు చేయిస్తున్నారు. హైదరాబాద్లోనే మాస్టర్ విగ్రహం తుది మెరుగులు దిద్దుకుంటోంది.

ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో వైష్ణవుడిగా కనిపించి ఆకట్టుకున్నారు డ్యాన్స్ మాస్టర్. ఈ పాత్ర చాలామందికీ గుర్తుండిపోతుంది. ఇప్పుడీ వైష్ణువడి వేషధారణలోనే రాకేష్ మాస్టర్ విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. సుమారు 11 అడుగుల విగ్రహాన్ని సొంత డబ్బుతోనే రెడీ చేయిస్తున్నారు ఆలేటీ ఆలం. కాగా డ్యాన్స్ మాస్టర్ విగ్రహం విశేషాలను ఆయన శిష్యుడు కొరియోగ్రాఫర్ బషీర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.