పవన్ ప్రమాణస్వీకారానికి రాని లావణ్య త్రిపాఠి, నన్ను క్షమించండి అంటూ..!

కొన్ని విషయాలు ఎంత దాచినా దాగవు. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ డేటింగ్ చేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. త్వరలో పెళ్లి అంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లను లావణ్య త్రిపాఠి కొట్టిపారేసింది. సడన్ గా గత ఏడాది వరుణ్ తేజ్-లావణ్య నిశ్చితార్థం ప్రకటన చేశారు. నవంబర్ లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అయితే సినిమాలు చెయ్యకున్నా మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ మాత్రం లావణ్య త్రిపాఠి చేసింది.

ఇటీవల చిరంజీవి ఇంట్లో జరిగిన పవన్ కళ్యాణ్ విజయోత్సవ వేడుకలలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పవన్ కళ్యాణ్ కు వెల్కమ్ చెప్పి సందడి చేశారు. ఇంత చేసిన వారు పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారానికి రాకపోవడం ఏమిటి? అసలు వారి రాకపోవడం వెనుక ఉద్దేశం ఏమిటి అన్నది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ జంట వస్తారని ఎదురు చూసిన ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ కనిపించి ఈ జంట మాత్రం కనిపించకపోవడంతో నిరాశ చెందారు. అయితే అసలు లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ రాలేకపోయిన కారణం ఏమిటి అంటే ఇటీవల లావణ్య త్రిపాఠీకి ప్రమాదం జరిగింది.

ఆమె కాలికి గాయమైంది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఒక ఫోటో కూడా షేర్ చేసింది. ఆ ఫోటో ఆధారంగా లావణ్య త్రిపాఠీకి గాయం పెద్దగానే అయినట్టుగా కనిపిస్తుంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన లావణ్య త్రిపాఠికి ఇంతలోనే ఏమైంది.. ఆ దెబ్బ ఎలా తగిలింది? అన్నది ప్రతి ఒక్కరు చర్చిస్తున్నారు. కాళ్లకు కట్టు కట్టించుకుని లేవలేని స్థితిలో ఉన్నారంటే దెబ్బ బాగానే తగిలింది. ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా లేదా ఇంట్లోనే పడ్డారా ఇలా ఎవరికి తోచినట్టు వారు చర్చిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *