సాయిధరమ్ తేజ్ తన స్పోర్ట్స్ బైక్ మీద వెళుతున్న సమయంలో అదుపుతప్పి కింద పడిపోవడంతో ఆపస్మారక స్థితిలోకి వెళ్లారు. కేబుల్ బ్రిడ్జ్, ఐకియా రూట్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన కుడి కన్ను, ఛాతి, పొట్టపై గాయాలయ్యాయి. అయితే సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కు గురికాగానే ఒక యువకుడు అబ్దుల్ పర్హాన్ అతడి ప్రాణాలు కాపాడాడు.
అంబులెన్స్ కు కాల్ చేసి సాయిధరమ్ తేజ్ ను ఆస్పత్రికి తరలించారు. సాయిధరమ్ తేజ్ ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాడంటే అదంతా కూడా ఆ అబ్బాయి పెట్టిన భిక్షనే. అయితే సాయిధరమ్ తేజ్ ను కాపాడిన అనంతరం చాలా మీడియా, యూట్యూబ్ సంస్థలు ఆ ముస్లిం అబ్బాయిని ఇంటర్వ్యూ చేశాయి. తనకు హీరో అని తెలియదని.. కాపాడానని.. చెప్పుకొచ్చాడు. సాయిధరమ్ తేజ్ టీం తనకు సాయం చేస్తుందని చెప్పాడు.
తాజాగా సాయిధరమ్ తేజ్ కూడా తన ప్రాణాలు కాపాడిన వ్యక్తికి ఏం చేసినా తక్కువనే అని.. అతడి రుణం తీర్చుకోలేనిది అని.. అతడికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని నంబర్ ఇచ్చినట్టు సాయిధరమ్ తేజ్ తెలిపారు. అతడి అవసరాలన్నీ తన టీం నెవరేర్చుతోందని సాయిధరమ్ తెలిపారు.
ఈడి కవరింగ్ చూడండి మీడియా ముందు confuse అయిపోయి ఆ అబ్బాయి అలా చెప్పేశాడు అంట😹🙆🏼♂️😹 pic.twitter.com/bIrNyB0OyA
— ఇవివి పంచ్ లు🤙 (@evvpunchlu333) July 31, 2023