పూరీ, మహేష్ బాబు కాంబోలో వచ్చిన మూవీ పోకిరీ. అప్పట్లో రికార్డులు సృష్టించింది. మహేష్ బాబులో మరో కోణాన్ని వెలికి తీసిన సినిమా ఇది. 12 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. రూ. 70 కోట్లను వసూలు చేసింది. ఇక ఇందులో పాటలకు ఫిదా కానీ వారుండరు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ఆయన కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్, స్వాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇలియానా కాకుండా మరో నటి కూడా హైలైట్ అయ్యింది ఆమె ఎవరో కాదు జ్యోతి రానా.
జ్యోతి రానా పేరు చెప్తే టక్కున గుర్తుపట్టలేరు కానీ ఆమెను చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. పోకిరి సినిమాలో లేడీ విలన్ గా కనిపించింది జ్యోతి రానా. విలన్ గ్యాంగ్ లో ఉండే యువతిగా కనిపించింది. తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది జ్యోతి రానా. పోకిరి సినిమా తర్వాత ఈ అమ్మడు దేవుడు చేసిన మనుషులు, మెహబూబా సినిమాల్లో నటించింది. అలాగే బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాల్లో కనిపించింది.
అయితే ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉంది.? ఏం చేస్తుంది అని చాలా మంది గూగుల్ లో గాలిస్తున్నారు. జ్యోతి రానా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. ఈ బ్యూటీకి సంబందించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఈ బ్యూటీ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.