ఉపాసన కోసం చిరంజీవి తల్లి అంజనమ్మ ఓ స్పెషల్ వంటకాన్ని తయారుచేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉపాసన. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇందులో ఉపాసన కోసం అంజనా దేవి దగ్గరుండి వంట చేయడం మనం చూడవచ్చు. వేడి వేడి పులావ్ లో కొత్తిమీర, పుదీనాతో అలంకరించడం, ఎలా వేయాలో ఎంత వేయాలో అంజనమ్మ చెబుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే సురేఖ పుట్టిన రోజు సందర్భంగా మెగా కోడలు ఉపాసన ఈ వ్యాపారాన్ని ప్రారంభించింది.
ఇందులో భాగంగా అత్త కోడళ్లు కలిసి ప్రీ కుక్డ్ ఫుడ్, ఇన్స్టంట్ మిక్స్లు తయారు చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే సమ్మర్ సందర్భంగాద వారు నోరూరించే ఆవకాయ పచ్చడి రెడీ చేశారు. మెగా కోడలు ఉపాసన సురేఖ మామిడి కాయ పచ్చడిని కలిపే సమయంలో వీడియో తీసింది. అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో మొదటగా చిరంజీవి తల్లి అంజనా దేవి కనిపిస్తారు.
అప్పుడు ఉపాసన ఆమె దగ్గరకు వెళ్లి ‘ మీరు ఎందుకు నాయనమ్మ సీరియస్ గా ఉన్నారు’ అని అంజనాదేవిని అడుగుతుంది. దీనికి ఆమె పని లేక ఇక్కడ కూర్చున్నాను’ అంటూ పంచ్ వేస్తుంది. ఇక ఆతర్వాత మీ కోడలు మంచిగా పికెల్(ఊరగాయ) చేయడం లేదా? అని అత్తపై ఫిర్యాదు చేస్తుంది ఉపాసన. అందుకు ప్రతిగా అంజనమ్మ .. ‘నువ్వున్నావ్ కదా.. మళ్లీ కోడలికి ఎందుకు పని? అని సరదాగా కౌంటర్ ఇస్తారు.
ఆ తర్వాత తన అత్త సురేఖని వీడియో తీస్తుంది ఉపాసన. అత్తమ్మ దగ్గరకు వెళ్లి ‘క్యా హో రా’ అని అడగ్గా.. తనకు హిందీ రాదని నవ్వేసింది సురేఖ. ఆ తర్వాత వెల్కమ్ టు ‘అత్తమ్మాస్ కిచెన్’ అంటూ ఆ వీడియో చివర్లో తెలపడం మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చేసింది. ఉపాసన తన ఫ్యామిలీతో కలిసి ఇంత సంతోషంగా ఉండడం మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది.